TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ
- శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు
- సేతుపతి విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీలో బలాబలాల పరీక్షకు ముందే టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు విధించింది. మే 13లోగా సభలో జరిగే విశ్వాస పరీక్షలో ఆయన పాల్గొనకుండా స్టే ఇస్తూ వేసవి విరామ కాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి వెనుక అధికారుల ఘోర తప్పిదం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో తిరుపత్తూరు పేరుతో రెండు నియోజకవర్గాలు ఉండటమే ఈ వివాదానికి మూలమైంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు ఓట్లను, పొరపాటున తిరుపత్తూరు జిల్లాలోని కౌంటింగ్ కేంద్రానికి పంపారని ఆయన తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో జరిగిన ఈ పొరపాటు వల్లే తాను ఓడిపోయానని పెరియకరుప్పన్ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
కేవలం ఒక్క ఓటుతోనే గెలుపోటములు నిర్ణయించబడినప్పుడు ఇటువంటి గందరగోళం అభ్యర్థి హక్కులను దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్ల ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టీవీకే ఎమ్మెల్యే సభలో ఓటు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బుధవారం జరిగే విశ్వాస పరీక్షలో టీవీకే పార్టీ ఒక ఓటును కోల్పోవడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు, ఇప్పుడు ఆ ఒక్క ఓటు వివాదమే శాపంగా మారింది. ఆదివారం నాడు కోర్టు ప్రత్యేకంగా సమావేశమై ఈ తీర్పు ఇవ్వడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!