Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం… వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఘటన జరిగిన ప్రాంతం రాజధాని భోపాల్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సర్కార్ సీరియస్ అయింది. ఘటనను తీవ్రంగా పరిగణించింది శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్. నిందితులను విడిచిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. గుణా సమీపంలో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారని… స్వయంగా సీఎం శివరాజ్ సింగ్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.
Also Read
ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో శనివారం ఉదయం 9.30 గంటలకు ఉన్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీతో పాటు హోమంత్రి, ప్రధాన కార్యదర్శి సహా సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. మరణించిన పోలీస్ కుటుంబాలకు సీఎం కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!