Lumpy Skin Disease: ఆందోళనకరంగా లంపి చర్మ వ్యాధి.. ఎలా సంక్రమిస్తోందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lumpy Skin Disease: భారతదేశంలో లంపి చర్మ వ్యాధి బారిన పడే జంతువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 1.85 లక్షలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి. ఇప్పటి వరకు 7300 పశువులు మరణించాయి. ఇన్ఫెక్షన్ మొదట గుజరాత్లో గుర్తించబడగా.. కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 8 ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.
ఇది ఎలా సంక్రమిస్తుంది?: లంపి చర్మ వ్యాధి అనేది భారతదేశంలోని పశువులను, ముఖ్యంగా ఆవులను ప్రభావితం చేసే అంటువ్యాధి. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేలు వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువు మరొక జంతువుతో సన్నిహితంగా ఉన్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
లంపి చర్మ వ్యాధి లక్షణాలు ఏమిటి?: జ్వరం, అవయవాలతో పాటు జననేంద్రియాల వాపు, కళ్లలో నీరు కారడం, రినైటిస్, లాలాజల స్రావాలు పెరగడం, చర్మంపై పొక్కులు పెరగడం, కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కూడా దారితీస్తుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, జంతువులు వ్యాధి బారిన పడవచ్చు. కానీ అవి ఎటువంటి సంకేతాలను చూపించనందున అవి లక్షణరహితంగా ఉంటాయి.
ఏదైనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?: ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలోని కృషి భవన్ నుండి కొత్త దేశీయ వ్యాక్సిన్ను ప్రారంభించారు. ఇజ్జత్నగర్(బరేలీ)లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నేషనల్ ఈక్విన్ రీసెర్చ్ సెంటర్, హిసార్ (హర్యానా) ఈ కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. భారతదేశంలో ఈ వ్యాధి మొదటిసారిగా వచ్చిన 2019 నుంచి శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్పై పనిచేస్తున్నారని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి పర్షోత్తమ్ రూపాలా తెలిపారు.
Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
వైరస్ను ఎలా నివారించవచ్చు?: పశువులకు టీకాలు వేయడం, దేశం లోపల జంతువుల కదలికలను తగ్గించడం, మృతదేహాలను పారవేయడం కోసం తగిన పద్ధతులను అనుసరించడం, క్రమం తప్పకుండా కీటక వికర్షకాలతో జంతువులకు చికిత్స చేయడం ద్వారా సంక్రమణ వ్యాప్తిని నియంత్రించవచ్చు. మృతదేహాలను భూమిలో లోతుగా, నీటి వనరులకు దూరంగా పాతిపెట్టాలి. ఇది ఒకప్పుడు పూర్తిగా ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైంది, కానీ ఇది నెమ్మదిగా ఆసియాతో సహా ఇతర ఖండాలకు వ్యాపించడం ప్రారంభించింది. భారతదేశంలో, ఇది మొదట 2019లో ఒడిశాలో నివేదించబడింది.
తాజావార్తలు
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..