Lumpy Skin Disease: ఆందోళనకరంగా లంపి చర్మ వ్యాధి.. ఎలా సంక్రమిస్తోందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lumpy Skin Disease: భారతదేశంలో లంపి చర్మ వ్యాధి బారిన పడే జంతువుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 1.85 లక్షలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి. ఇప్పటి వరకు 7300 పశువులు మరణించాయి. ఇన్ఫెక్షన్ మొదట గుజరాత్లో గుర్తించబడగా.. కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 8 ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.
ఇది ఎలా సంక్రమిస్తుంది?: లంపి చర్మ వ్యాధి అనేది భారతదేశంలోని పశువులను, ముఖ్యంగా ఆవులను ప్రభావితం చేసే అంటువ్యాధి. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేలు వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువు మరొక జంతువుతో సన్నిహితంగా ఉన్నప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది.
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
లంపి చర్మ వ్యాధి లక్షణాలు ఏమిటి?: జ్వరం, అవయవాలతో పాటు జననేంద్రియాల వాపు, కళ్లలో నీరు కారడం, రినైటిస్, లాలాజల స్రావాలు పెరగడం, చర్మంపై పొక్కులు పెరగడం, కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కూడా దారితీస్తుంది. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో, జంతువులు వ్యాధి బారిన పడవచ్చు. కానీ అవి ఎటువంటి సంకేతాలను చూపించనందున అవి లక్షణరహితంగా ఉంటాయి.
ఏదైనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?: ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ న్యూఢిల్లీలోని కృషి భవన్ నుండి కొత్త దేశీయ వ్యాక్సిన్ను ప్రారంభించారు. ఇజ్జత్నగర్(బరేలీ)లోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నేషనల్ ఈక్విన్ రీసెర్చ్ సెంటర్, హిసార్ (హర్యానా) ఈ కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. భారతదేశంలో ఈ వ్యాధి మొదటిసారిగా వచ్చిన 2019 నుంచి శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్పై పనిచేస్తున్నారని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి పర్షోత్తమ్ రూపాలా తెలిపారు.
Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..
వైరస్ను ఎలా నివారించవచ్చు?: పశువులకు టీకాలు వేయడం, దేశం లోపల జంతువుల కదలికలను తగ్గించడం, మృతదేహాలను పారవేయడం కోసం తగిన పద్ధతులను అనుసరించడం, క్రమం తప్పకుండా కీటక వికర్షకాలతో జంతువులకు చికిత్స చేయడం ద్వారా సంక్రమణ వ్యాప్తిని నియంత్రించవచ్చు. మృతదేహాలను భూమిలో లోతుగా, నీటి వనరులకు దూరంగా పాతిపెట్టాలి. ఇది ఒకప్పుడు పూర్తిగా ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైంది, కానీ ఇది నెమ్మదిగా ఆసియాతో సహా ఇతర ఖండాలకు వ్యాపించడం ప్రారంభించింది. భారతదేశంలో, ఇది మొదట 2019లో ఒడిశాలో నివేదించబడింది.
తాజావార్తలు
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!