LPG Gas Price: భారీగా పెరిగిన గ్యాస్ ధర.. సిలిండర్పై రూ.105 పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాస్ ధరలు చూస్తేనే మంట మండుతున్నాయి… అయితే, ఈ సారి వడ్డింపులో వంట గ్యాస్ సిలిండర్ ధరకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.. తాజా ధరలను పరిశీలిస్తే.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ. 105 పెరగగా.. కోల్కతాలో రూ. 108 పెరిగింది.. ఇక, 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది… కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.. మార్చి 1వ తేదీన సబ్సిడీ లేని 14 కిలోల సిలిండర్ (ఎల్పిజి గ్యాస్ సిలిండర్) ధర మాత్రం పెరగలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ధర ఎటువంటి మార్పు లేకుండా రూ.899.5 వద్ద స్థిరంగా ఉండగా.. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను మాత్రం రూ.105 పెంచారు.
Read Also: Russia-Ukraine War: దాడులు మరింత ఉధృతం
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటించాయి.. వంట గ్యాస్ జోలికి పోకపోయినా.. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,012గా మారింది. కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇక, 5 కేజీల సిలిండర్ ధర కూడా రూ.27 పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో 5 కేజీల సిలిండర్ ధర రూ.569కి చేరింది.. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లలో ఎలాంటి పెంపుదల లేదు. కాగా, ఎల్పీజీ సిలిండర్ ధర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రతి నెల సవరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. గత నెలలో అంటే ఫిబ్రవరి 2022లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 91.50 తగ్గగా.. ఇప్పులు మళ్లీ వడ్డించారు.. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.105 పెరిగి రూ.1,907 నుంచి రూ.2,012కి చేరగా.. . కోల్కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.108 పెరిగి రూ.2,095కి చేరుకుంది. ఇంతకు ముందు దీని ధర రూ.1,987గా ఉంది. మరోవైపు ముంబైలో రూ.1963కి చేరింది వాణిజ్య గ్యాస్ ధర… గతంలో ఇది రూ.1857 ఉండగా.. ఇప్పుడు రూ.106 పెరిగింది. అదే సమయంలో చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2145.5కి పెరిగింది. ఇక్కడ రూ.65 వడ్డించారు.. ఇంతకు ముందు ధర రూ.2080.5.గా ఉంది..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..