Lok Sabha Election: గురువారం లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election: లోక్సభ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత గురువారం లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ నెలలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈసీ అధికారులు పర్యటిస్తున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఒకేసారి నిర్వహించవచ్చో..? లేదో.. అనే విషయాన్ని అంచనా వేయాలని కేంద్రం ఈసీని కోరింది. బుధవారం పర్యటన ముగియగానే తర్వాతి రెండు రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వెలువడొచ్చని తెలుస్తోంది.
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
Read Also: Karnataka: పాక్ మద్దతుదారుల్ని కాల్చిపారేయాలి.. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయంలో భద్రతా యంత్రాంగం అన్ని వివరాలను ఈసీకి అందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్తో సహా మొత్తం ప్యానెల్ మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో చివరిసారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్-లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు.
అయితే, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, జమ్మూకాశ్మీర్లో సెప్టెంబర్ నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని గతేడాది డిసెంబర్లో ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
మరోవైపు ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీజేపీ పార్టీ తన 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఇక ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్పై మిత్ర పక్షాలతో చర్చిస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!