PM Modi: ‘‘ మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం’’.. నాలుగో దశ ఓటింగ్ ముందు పీఎం సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాలుగో దశ పోలింగ్కి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓటర్ల సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడాని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని పీఎం మోడీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ సహా అన్ని ప్రాంతాల్లో ఓటేసేందుకు ఓటర్లు రికార్డు సంఖ్యలో పోలింగ్ సెంటర్లకు చేరుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
‘‘ఈరోజు 4వ దశ లోక్సభ ఎన్నికలలో, 10 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో మరియు యువ ఓటర్లు కూడా ఓటు వేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మహిళా ఓటర్లు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. కాబట్టి రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్ధాం’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
‘‘ నాలుగో దశ లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఓటర్లు రికార్డు స్థాయిలో పోలింగ్ బూత్లకు చేరుకుని వారసత్వాన్ని గౌరవించే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నక్సలిజాన్ని రూపుమాపడమే వారి సంకల్పం మరియు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మీ ప్రతి ఓటు సుస్థిరమైన, దృఢమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వానికి బలమైన స్తంభంలా పనిచేస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17, ఉత్తరప్రదేశ్ నుంచి 13, మహారాష్ట్ర నుంచి 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిది, బీహార్ నుంచి 5, జార్ఖండ్, ఒడిశా నుంచి నాలుగు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకటి ఉన్నాయి. ఈ దశ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, బీజేపీ నేతుల గిరిరాజ్ సింగ్ చౌహాన్, శత్రఘ్ను సిన్హా, యూసప్ పఠాన్, వైఎస్ షర్మిలా వంటి ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు.
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి…
— Narendra Modi (@narendramodi) May 13, 2024
తాజావార్తలు
-
Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!