పశ్చిమ బెంగాల్లో నువ్వానేనా? అన్నట్టుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అధికార టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇటీవల టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
తాజాగా లియాండర్ పేస్కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్స్-కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పించడంతో పాటు రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించింది. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీలో చేరిన వారం రోజులకే కేంద్రం ఇంత భద్రత కల్పించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
లియాండర్ పేస్ బీజేపీలో చేరక ముందు తృణమూల్ కాంగ్రెస్లో ఉండేవారు. అయితే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో పేస్కు సీటు కేటాయించలేదు. కేవలం ప్రచారం చేస్తున్నారు.
