Lawyer Fight For Justice: రూ.20 కోసం 22 ఏళ్ల పాటు పోరాడిన న్యాయవాది.. చివరకు ఎంత దక్కిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawyer Fight For Justice: డబ్బు అంటే ఎవరికి చేదు చెప్పండి… రూపాయి ఉచితంగా వస్తుందంటేనే జనాలు ఎగబడతారు. మరి మన డబ్బులు మనం సాధించుకోవడంలో పోరాటం చేస్తే తప్పేముంది. ఓ న్యాయవాది కూడా ఇలాగే ఆలోచించాడు. వివరాల్లోకి వెళ్తే.. తుంగనాథ్ చతుర్వేది అనే లాయర్ 1999లో ఉత్తరప్రదేశ్లోని మధుర కంటోన్మెంట్ స్టేషన్లో తనతో పాటు మరో వ్యక్తి కోసం రూ.70కి రెండు రైలు టికెట్లు కొన్నాడు. టిక్కెట్ ధర ఒక్కొక్కటి రూ.35. అయితే చతుర్వేది రూ.100 ఇవ్వగా టిక్కెట్ కౌంటర్లో పనిచేసే క్లర్క్ రూ.10 మాత్రమే రిటర్న్ ఇచ్చాడు. రూ.20 ఇవ్వలేదు. తనకు మిగతా డబ్బులు ఇవ్వాలని చతుర్వేది మొత్తుకున్నా క్లర్క్ వినిపించుకోలేదు. ఇంతలో రైలు రావడంతో చతుర్వేది వెళ్లిపోయాడు.
Read Also: Asteroids : భూమిపైకి ఆస్టరాయిడ్ల దండయాత్ర.. ఏ క్షణమైనా..
Also Read
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
- Kangana Ranaut: "మంటకు ఆజ్యం పోయవద్దు!" హృతిక్పై విరుచుకుపడిన కంగనా రనౌత్
- CJP: సీజేపీకి రూ.1 కోటి నిధులపై ప్రశ్నలు.. అభిజిత్ దీప్కే తండ్రి ఆర్థిక పరిస్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
కానీ తనకు రావాల్సిన రూ.20 కోసం లాయర్ చతుర్వేది వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించి100 సార్లకు పైగా కోర్టు మెట్లెక్కాడు. తాజాగా ఈ కేసులో వినియోగదారుల న్యాయస్థానం చతుర్వేదికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. చతుర్వేదికి రూ.15 వేలు ఇవ్వాలని కోర్టు రైల్వే శాఖను ఆదేశించింది. అదనంగా వసూలు చేసిన రూ.20కి 1999 నుంచి 2022 వరకు ఏడాదికి 12% చొప్పున వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల నిర్ధిష్ట సమయంలో ఈ నగదును చెల్లించకపోతే 15 శాతంతో వడ్డీతో చెల్లించాలని కోర్టు హెచ్చరించింది. కాగా ఈ కేసులో తనకు లభించిన పరిహారం చాలా తక్కువ అని చతుర్వేది ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ తీర్పు తనకు కలిగించిన మానసిక వేదనను తీర్చలేదని చతుర్వేది వాపోయాడు.
Mathura, UP | In 1999 I bought 2 tickets which amounted to Rs 70 but clerk took Rs 90. I was forced to seek legal remedy. After a 22-year-long fight, the court ruled in my favour, asking railways to pay me Rs 15,000. It was my fight against injustice: Advocate Tungnath Chaturvedi pic.twitter.com/ynbpQUWKMX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2022
తాజావార్తలు
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!