Waqf Board: రైతులు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. మహారాష్ట్రలో కొత్త వివాదం..
- మహారాష్ట్రలో వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్..
- లాతూర్ జిల్లాలో రైతులకు నోటీసులు..
- రైతులు భూములను క్లెయిమ్ చేసిన వక్ఫ్ బోర్డ్..
- ప్రభుత్వం కల్పించుకోవాలని బాధితులు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన 300 ఎకరాల భూమిని ‘‘వక్ఫ్ బోర్డ్’’ క్లెయిమ్ చేయడంపై వివాదం ప్రారంభమైంది. అయితే, అక్కడి రైతులు మాత్రం ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని చెబుతున్నారు. ఇటీవల ఈ భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డు రైతులకు నోటీసులు పంపింది. 103 రైతులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.
Read Also: Black magic: యూట్యూబ్లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
Also Read
అయితే, ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఛత్రపతి శంభాజీనగర్లోని మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్కి బాధితులు తీసుకెళ్లారు. బాధితుల్లో ఒకరైన తుకారాం కన్వటే మాట్లాడుతూ.. ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని, ఇవి వక్ఫ్ భూములు కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది, తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.
వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రం తీసుకువచ్చిన ఈ సందర్భంలోనే ఈ లాతూర్ రైతుల సమస్య వెలుగులోకి వచ్చింది. భూములను క్లెయిమ్ చేసే అపరిమిత అధికారాలతో పాటు వక్ఫ్ చట్టంలోని మార్పుల కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ప్రతిపక్షాల నుంచి దీనిపై అభ్యంతరం రావడంతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది. జేపీపీ తన నివేదికను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్పించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల కర్ణాటకలో కూడా ఇలాగే రైతుల భూముల్ని వక్ఫ్ ఆస్తులుగా పేర్కొనడం వివాదాస్పదమైంది. రైతులు, ఇతర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!