Waqf Board: రైతులు భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్.. మహారాష్ట్రలో కొత్త వివాదం..
- మహారాష్ట్రలో వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్..
- లాతూర్ జిల్లాలో రైతులకు నోటీసులు..
- రైతులు భూములను క్లెయిమ్ చేసిన వక్ఫ్ బోర్డ్..
- ప్రభుత్వం కల్పించుకోవాలని బాధితులు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Board: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో రైతులకు సంబంధించిన 300 ఎకరాల భూమిని ‘‘వక్ఫ్ బోర్డ్’’ క్లెయిమ్ చేయడంపై వివాదం ప్రారంభమైంది. అయితే, అక్కడి రైతులు మాత్రం ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని చెబుతున్నారు. ఇటీవల ఈ భూములు తమవే అంటూ వక్ఫ్ బోర్డు రైతులకు నోటీసులు పంపింది. 103 రైతులు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు.
Read Also: Black magic: యూట్యూబ్లో క్షుద్రపూజలు.. ధనవంతులు కావాలని వ్యక్తి తల నరికి హత్య..
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
అయితే, ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఛత్రపతి శంభాజీనగర్లోని మహారాష్ట్ర స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్కి బాధితులు తీసుకెళ్లారు. బాధితుల్లో ఒకరైన తుకారాం కన్వటే మాట్లాడుతూ.. ఈ భూములు తమకు తరతరాలుగా సంక్రమించాయని, ఇవి వక్ఫ్ భూములు కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసుపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది, తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.
వక్ఫ్ సవరణ బిల్లుని కేంద్రం తీసుకువచ్చిన ఈ సందర్భంలోనే ఈ లాతూర్ రైతుల సమస్య వెలుగులోకి వచ్చింది. భూములను క్లెయిమ్ చేసే అపరిమిత అధికారాలతో పాటు వక్ఫ్ చట్టంలోని మార్పుల కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ప్రతిపక్షాల నుంచి దీనిపై అభ్యంతరం రావడంతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది. జేపీపీ తన నివేదికను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్పించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల కర్ణాటకలో కూడా ఇలాగే రైతుల భూముల్ని వక్ఫ్ ఆస్తులుగా పేర్కొనడం వివాదాస్పదమైంది. రైతులు, ఇతర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!