SI Subhashree Case: లేడీ ఎస్సైని టార్గెట్ చేసి.. కత్తులతో వెంబడించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Sub Inspector Subhashree Nayak Chased And Abused In Bhubaneswar: రానురాను మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుండగుల్లో మార్పు రావట్లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒక లేడీ ఎస్సైనే కత్తులతో బెదిరించారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును.. ఒక లేడీ ఎస్సైని కొందరు దుండగులు కత్తులతో వెంబడించారు. అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతూ, ఆమెని ఫాలో అయ్యారు. అయితే.. ఆ ఎస్సై తన తెలివితో వారి బారి నుంచి తప్పించుకుంది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Online Dating Fraud: వేశ్య కోసం వెతికాడు.. దోపిడీకి గురయ్యాడు
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
భువనేశ్వర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అయితే.. ఆమె రిజర్వ్ బ్యాంక్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, కొందరు దుండగులు ఆమెని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తనకి అనుమానం రావడంతో.. శుభశ్రీ తన వేగాన్ని మరింత పెంచింది. దుండగులు కూడా వేగం పెంచి, ఆమెని వెండబడించారు. కత్తులు, తల్వార్లతో బెదిరించారు. అంతేకాదు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడారు. ‘ఈరోజు మా చేతుల్లో అయిపోయావ్’ అంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే.. శుభశ్రీ వారి మాటలకు రెచ్చిపోకుండా, తెలివిగా వ్యవహరించింది. ఆ దుండగుల కళ్లు గప్పి, వారి బారి నుంచి తప్పించుకుంది.
Gun Fire: ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు తుపాకీతో కాల్పులు
అనంతరం ఈ ఘటనపై శుభశ్రీ భువనేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎస్ఐ శుభశ్రీ నాయక్కు డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. కరోనా లాక్డౌన్ సమయంలో పలువురికి సహాయం చేశారు. పేదవారికి భోజనం అందించారు. ఆమె సేవలను గుర్తించి.. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు ప్రముఖులు శుభశ్రీని అభినందించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!