SI Subhashree Case: లేడీ ఎస్సైని టార్గెట్ చేసి.. కత్తులతో వెంబడించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Sub Inspector Subhashree Nayak Chased And Abused In Bhubaneswar: రానురాను మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుండగుల్లో మార్పు రావట్లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒక లేడీ ఎస్సైనే కత్తులతో బెదిరించారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును.. ఒక లేడీ ఎస్సైని కొందరు దుండగులు కత్తులతో వెంబడించారు. అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతూ, ఆమెని ఫాలో అయ్యారు. అయితే.. ఆ ఎస్సై తన తెలివితో వారి బారి నుంచి తప్పించుకుంది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Online Dating Fraud: వేశ్య కోసం వెతికాడు.. దోపిడీకి గురయ్యాడు
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
భువనేశ్వర్లోని మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ శుభశ్రీ నాయక్(36) సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. అయితే.. ఆమె రిజర్వ్ బ్యాంక్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, కొందరు దుండగులు ఆమెని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. తనకి అనుమానం రావడంతో.. శుభశ్రీ తన వేగాన్ని మరింత పెంచింది. దుండగులు కూడా వేగం పెంచి, ఆమెని వెండబడించారు. కత్తులు, తల్వార్లతో బెదిరించారు. అంతేకాదు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడారు. ‘ఈరోజు మా చేతుల్లో అయిపోయావ్’ అంటూ వార్నింగులు ఇచ్చారు. అయితే.. శుభశ్రీ వారి మాటలకు రెచ్చిపోకుండా, తెలివిగా వ్యవహరించింది. ఆ దుండగుల కళ్లు గప్పి, వారి బారి నుంచి తప్పించుకుంది.
Gun Fire: ఇంటి ముందు మూత్రం పోయొద్దన్నందుకు తుపాకీతో కాల్పులు
అనంతరం ఈ ఘటనపై శుభశ్రీ భువనేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా.. ఎస్ఐ శుభశ్రీ నాయక్కు డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. కరోనా లాక్డౌన్ సమయంలో పలువురికి సహాయం చేశారు. పేదవారికి భోజనం అందించారు. ఆమె సేవలను గుర్తించి.. మెగాస్టార్ చిరంజీవి సహా కొందరు ప్రముఖులు శుభశ్రీని అభినందించారు.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!