TmilNadu Air Port: బ్యాగులో కొండ చిలువలు.. ఎయిర్ పోర్టులో అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TmilNadu Air Port: సాధారణంగా ఊరి నుంచి, లేదా విదేశాల నుంచి వస్తుంటే బ్యాగుల్లో బట్టలు లేదా విలువైన వస్తువులు తీసుకొని వస్తారు. లేదంటే మన బంధువులు లేదా స్నేహితులు ఏమైనా కొనుక్కురమ్మంటే ఆ వస్తువులను తీసుకొస్తాం. కానీ ఈ వ్యక్తి వేరే దేశం నుంచి వస్తూ బ్యాగులో ఏకంగా కొండ చిలువలను.. బల్లులను తీసుకొచ్చాడు. ఆయన బ్యాగు నిండా కొండచిలువలు, బల్లులే ఉన్నాయి. విమానం దిగి బయటికి వెళుతున్న అతని బ్యాగును పరిశీలించిన విమానాశ్రయ సిబ్బంది అవాక్కయ్యారు. బ్యాగును తెరచి చూడగా అందులో ఉన్న కొండచిలువలను చూసిన అధికారులు షాక్ గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్పోర్టులో జరిగింది.
Read also: Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
వర్షాలు దంచి కొట్టిన సందర్భంలో పలు చోట్ల పాములు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చూశాం. కానీ, తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఒకేసారి 47 కొండచిలువులను పట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇవి వరదల్లో కొట్టుకువచ్చినవి కావు. కావాలనే మలేషియా నుంచి పట్టుకువచ్చినవి. అక్రమంగా వీటిని దేశంలోకి తెచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో మలేషియాకు చెందిన వ్యక్తి వెంట 47 కొండ చిలువలను, రెండు బల్లులను పట్టుకుని దిగాడు. అతని పెట్టె కదులుతున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. అక్రమంగా తీసుకువచ్చిన ఆ జీవులను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే
మలేషియా రాజధాని కౌలలాంపూర్కు చెందిన మహమ్మద్ మెయిద్దీన్ తిరుచి అంతర్జాతీయ విమనాశ్రయంలో దిగాడు. ఆయన ఒక్కడే దిగలేదు. తనతో పాటు 47 కొండచిలువలను, రెండు బల్లులను అక్రమంగా తీసుకువచ్చాడు. విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత అతని బ్యాగ్లో ఏవో కదులుతున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీలు చేశారు. ఆ బ్యాగ్లో నుంచి పలు జాతులకు చెందిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోల్స్ ఉన్న బాక్స్లో ఆ కొండచిలువలను, బల్లులను మెయిద్దీన్ వెంట తీసుకు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు మెయిద్దీన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొండ చిలువలను తీసుకొచ్చిన విషయాన్ని కస్టమ్స్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని ఆ మూగ జీవాలను తిరిగి మలేషియా దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!