Killer Plant Fungus: కోల్కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Killer Plant Fungus: ప్రపంచంలో అత్యంత అరుదుగా మొక్కల్లో సోకే ఫంగస్ మనుషులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తిలో కనుక్కున్నారు. మొక్కలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఈ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శిలీంధ్రం ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తి మొక్కలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే ప్లాంట్ మైకాలజిస్ట్. మొక్కల శిలీంధ్రాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే సదరు వ్యక్తికి శిలీంద్రం ఇన్ఫెక్షన్ సోకింది.
మెడికల్ మైకాలజీ కేస్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ఈ ఫంగస్ వ్యాధికి గురైన వ్యక్తి కేస్ స్టడీని వివరించారు. గుర్తుతెలియని వ్యాధి సోకిన 61 ఏళ్ల వ్యక్తికి గొంతు బొంగురుపోవడంతో పాటు దగ్గు, అలసట, మూడు నెలల నుంచి ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కోల్ కతాలోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే బాధిత వ్యక్తికి షుగర్, హెచ్ఐవీ ఇన్ఫెక్షన్, మూత్రపిండాల వ్యాధి, మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు లేవు. అనారోగ్యానికి గురైన వ్యక్తి మొక్కలు, కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, మొక్కలకు వచ్చే వివిధ రకాల శిలీంద్రాలపై పనిచేస్తుంటారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
Read Also: April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. అసలు ఎలా పుట్టింది..? దాని వెనక ఉన్న కథేంటి..?
కోల్కతాలోని కన్సల్టెంట్ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్కు చెందిన పరిశోధకులు, డాక్టర్ సోమా దత్తా మరియు డాక్టర్ ఉజ్వాయిని రే దీనిపై సృష్టిసారించారు. ‘‘కొండ్రోస్టీరియం పర్పురియం’’ అనే మొక్కల్లో వచ్చే శిలీంధ్రం సదరు వ్యక్తికి వ్యాధిని కలిగించినట్లు తేలింది. ఇది గులాబీ కుటుంబం మొక్కల్లో వెండి ఆకు వ్యాధిని కలిగిస్తుంది. ఇలా మొక్కలకు వచ్చే ఓ ఫంగస్ మానవుడిలో వ్యాధికి కారణం అవడం ఇదే తొలిసారి. అయితే దీన్ని సంప్రదాయ పద్దతులైన మైక్రోస్కోపి, కల్చర్ ద్వారా గుర్తించలేము. సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధిని కనుక్కోవచ్చు.
ఈ ఫంగస్ వ్యాధికి గురైన వ్యక్తి మెడ వద్ద ఉన్న గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించి, యాంటీ ఫంగల్ మందులను వైద్యులు రాశారు. అయితే రెండు ఏళ్లుగా సదరు వ్యక్తి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అతడిలో కనిపించకపోవడంతో పూర్తిగా కోలుకున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
తాజావార్తలు
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!