Minister Kishan Reddy: స్మార్ట్ సిటీ నిధులపై కేసీఆర్ కుటుంబం అబద్ధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy’s comments on TRS over smart cities: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధులపై కేసీఆర్ కుటుంబం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. స్మార్ట్ సిటీ మిషన్ కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన రు. 1000 కోట్ల నిధులలో, ఇప్పటి వరకు రు. 392 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. వరంగల్, కరీంనగర్ నగరాలకు స్మార్ట్ సిటీ మిషన్ పథకం క్రింద విడుదల చేయవలసిన 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా విడుదల చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం విడుదల చేయవలసిన రూ. 392 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ నిధులలో ఇప్పటి వరకు కేవలం రు. 210 కోట్లను మాత్రమే విడుదల చేసిందని అన్నారు.
స్మార్ట్ సిటీ మిషన్ పథకం ప్రారంభమైన 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మ్యాచింగ్ గ్రాంట్ నిధులను 6 సంవత్సరాలు ఆలస్యం చేసిందని.. చివరకు కేంద్రం ఒత్తిడి మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి మాత్రమే కేటాయించడం ప్రారంభించిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేస్తే కరీంనగర్, వరంగల్ నగరాల్లో డ్రైనేజీ పనులు పూర్తయ్యేవని అన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద తెలంగాణకు రూ. 2780 కోట్లు ఇచ్చామని అన్నారు. 12 పట్టనాల్లో రూ. 1660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
తెలంగాణ ప్రభుత్వంలోని కీలకమై ఆర్థిక, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, మునిసిపల్, మైనింగ్, పట్టణాభివృద్ధి, ఐటీ వంటి మంత్రిత్వశాఖలు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల వద్దే ఉన్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. స్మార్ట్ సిటీలకు విడుదల చేసే నిధులపై తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు.. కేంద్రప్రభుత్వంపై ఏ విధమైన విషప్రచారం సాగిస్తుందో అర్థం అవుతుందని అన్నారు. గత మూడేళ్లుగా స్మార్ట్ సిటీస్ కు కేంద్రం రూపాయి కూడా విడుదల చేయలేదనే ప్రచారాన్ని ఖండించారు. కల్వకుంట్ల కుటుంబ పాలకులు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం ఆపేసి, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దృష్టిని కేంద్రీకరించాలని కోరుతున్నానని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!