Gyanvapi Mosque Case: వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు- శృంగర్ గౌరీ కేసులో దాఖలైన వ్యాజ్యంపై వారణాసి జిల్లా కోర్టు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. మతపరమైన సున్నితమైన అంశంలో జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ గత నెలలో ఉత్తర్వులను సెప్టెంబర్ 12 వరకు రిజర్వ్ చేశారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతలను ప్రతిరోజూ పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జ్ఞానవాపి మసీదు వక్ఫ్ ఆస్తి అని పేర్కొంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది.గతంలో, దిగువ కోర్టు కాంప్లెక్స్ను వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మే 16న సర్వే పనులు పూర్తి చేసి మే 19న కోర్టులో నివేదిక సమర్పించారు. జ్ఞానవాపి మసీదు-శృంగర్ గౌరీ కాంప్లెక్స్లోని వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం కనిపించిందని హిందూ పక్షం దిగువ కోర్టులో వాదించింది, అయితే ముస్లిం పక్షం దానిని వ్యతిరేకించింది.
Also Read
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
- PM Modi: డ్రగ్స్కు దూరంగా యువత.. వికసిత్ భారత్కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Supreme Court: సుప్రీంకోర్టు ముందుకు నేడు 220 పిల్స్
ఇదిలా ఉండగా, కోర్టు ఆదేశాలకు ముందు నగరంలో పోలీసులు నిషేధాజ్ఞల పాటు, భద్రతను కట్టుదిట్టం చేశారు. వారణాసిలో ఆంక్షలను ధ్రువీకరిస్తూ పోలీసు కమీషనర్ ఎ.సతీష్ గణేష్ ఆదివారం మాట్లాడుతూ.. వారణాసి కమిషనరేట్లో నిషేధాజ్ఞలు జారీ చేశామని, శాంతిభద్రతలు పరిరక్షించేలా చూసేందుకు ఆయా ప్రాంతాల్లోని మత పెద్దలతో సంభాషించాలని అధికారులను కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం, నగరం మొత్తాన్ని వారి అవసరాలకు అనుగుణంగా పోలీసు బలగాలను కేటాయించిన విభాగాలుగా విభజించామని ఆయన చెప్పారు. అలాగే సున్నిత ప్రాంతాల్లో ఫ్లాగ్మార్చ్, పాదయాత్ర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, హోటళ్లు, అతిథి గృహాల్లో తనిఖీలు ముమ్మరం చేసి సామాజిక మాధ్యమాలపై కూడా నిఘా ఉంచారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!