Veterinary student Case: వయనాడ్ స్టూడెంట్ డెత్ కేస్.. 29 గంటల పాటు సీనియర్ల దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veterinary student Case: కేరళలో సంచలన సృష్టించిన వయనాడ్ వెటర్నరీ విద్యార్థి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ ప్రారంభించింది. వయనాడ్ జిల్లాలో ఓ కాలేజ్ హాస్టల్లో 20 ఏళ్ల సిద్ధార్థన్ ఫిబ్రవరి 18న హాస్టల్ బాత్రూమ్లో చనిపోయి కనిపించాడు. కేరళ అధికార పార్టీ సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలతో సహా, ఇతర సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు తీవ్రంగా దాడి చేయడంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
సిద్ధార్థన్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు సీనియర్లు, ఇతర విద్యార్థులు కంటిన్యూగా 29 గంటల పాటు హింసించి దాడి చేశారని, కేరళ పోలీసులు సీబీఐకి అందించిన ఆత్మహత్య కేసు ఫైల్లో తెలిపారు. వైతిరి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రశోభ్ పివి.. కేసు ఫైల్లో సిద్ధార్థన్ని సీనియర్లు, తోటివారు ‘‘శారీరకంగా మానసికంగా హింసించారు’’ అని రాశారు. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటల వరకు సిద్ధార్థన్పై బెల్టుతో నిరంతరం దాడి చేసి, క్రూరంగా ర్యాగింగ్కి పాల్పడ్డారు. దీంతో అతను మానసిక ఒత్తిడికి గురై ఫిబ్రవరి 18వ తేదీ మధ్యాహ్నం 12.30 నుంచి 13.45 గంటల మధ్య మెన్స్ హాస్టల్లో బాత్రూమ్లో ఉరి వేసుకుని మరణించాడని పోలీస్ నివేదిక పేర్కొంది.
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
Read Also: LSG vs GT: కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ కేసులో 20 మందిపై వయనాడ్లోని వైత్తిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై రాజకీయ దుమారం చెలరేగడంతో మార్చి 9న కేరళ సీఎం పినరయి విజయన్ సీబీఐ విచారణకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా కీలక ఫైళ్లను ఇంకా సీబీఐకి అందచేయలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆరోపించడంతో ఈ అంశం పెద్ద వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సీబీఐ విచారణకు కాలయాపన చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసిందని విద్యార్థి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తామని విద్యార్థి కుటుంబానికి తిరువనంతపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. విద్యార్థి తండ్రి జయప్రకాష్ తన కొడుకు చనిపోవడానికి 8 నెలల ముందు కూడా వేధింపులకు గురయ్యాడని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చాలా కాలంగా కాలేజీలోనే ఉంటున్నారని, తన కుమారుడి బట్టలు విప్పి మోకాళ్లపై కూర్చోబెట్టారని ఆరోపించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..