Kerala: తల్లీ కొడుకులకు ఒకేసారి ప్రభుత్వ కొలువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother and Son To Join Government Service Together: కేరళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇద్దరు కలిసి క్లాసులు వెళ్లడం, కలసి చదవడంతో పాటు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దీంతో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన బిందు (45), ఆమె కొడుకు వివేక్(24) ఇద్దరు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి ఒకేసారి ఉద్యోగాలను సంపాదించారు.
బిందు తన కొడుకు వివేక్ పదో తరగతిలో ఉన్న సమయంలో కొడుకు చదువును ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవడం ప్రారంభించింది. ఈ అలవాటే బిందును ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అయ్యేలా ప్రోత్సహించాయి. ఇలా తొమ్మిదేళ్ల తరువాత ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) ఎగ్జామ్ లో బిందు 92వ ర్యాంక్ సాధించగా.. ఆమె కొడుకు వివేక్ లోయర్ డిజిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంకు సాధించాడు. మూడు ప్రయత్నాల తర్వాత నాలుగో ప్రయత్నంలో ఉద్యోగం సాధించినట్లు బిందు వెల్లడించింది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఎదురుకాల్పులు.. రాహుల్ భట్ ను హత్య చేసిన ఉగ్రవాది కోసం వేట
గత పదేళ్లుగా అంగన్వాడీ టీచర్ గా ఉన్న బిందు.. అసలు లక్ష్యం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సాధించడం తన లక్ష్యం అని చెబుతోంది. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ తీసుకునే సమయంలో తమకు టీచర్లు, ఫ్రెండ్స్ తో పాటు తన తండ్రి కూడా ఎంతగానో ప్రోత్సహించాడని వివేక్ తెలిపాడు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!