Kerala High Court: అత్యాచార బాధితురాలిని రేపిస్ట్ బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయలేము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court: అత్యాచార బాధిత మహిళ తనపై అత్యాచారం చేసిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయరాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(MTP) చట్టంలోని సెక్షన్ 3(2) ప్రకారం గర్భం కొనసాగించడం వల్ల మహిళ శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి తీవ్ర గాయం ఏర్పడితే గర్భాన్ని రద్దు చేయవచ్చు. సెక్షన్ 3 (2) యొక్క వివరణ 2 ప్రకారం, అత్యాచారం వల్ల గర్భం సంభవించినప్పుడు, గర్భం వల్ల కలిగే వేదన గర్భిణీ స్త్రీ యొక్క మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన గాయంగా భావించాలి. అందువల్ల, అత్యాచార బాధితురాలు తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయకూడదు.’’ అని కోర్టు చెప్పింది.
అత్యాచార బాధితురాలు తన అవాంఛిత గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయడానికి అనుమతించకపోవడం, ఆమె మాతృత్వపు బాధ్యతను, గౌరవంగా జీవించే ఆమె మానవ హక్కును నిరాకరించినట్లు అవుతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని హైకోర్టు పేర్కొంది. వివాహం కాకుండా గర్భం దాల్చడం చాలా సందర్భాల్లో హానికరం, ముఖ్యంగా లైంగిక వేధింపుల తర్వాత బాధితురాలు, బాధితురాలి శారీరర, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే గాయానికి కారణం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల ఫలితంగా వచ్చే గర్భం స్వచ్ఛందంగా, బుద్ధిపూర్వకంగా కోరుకున్న గర్భం కానది చెప్పింది.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Rapido: హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో ఓటేసిందుకు పోలింగ్ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్..
16 ఏళ్ల అత్యాచార బాధిత యువతి తన తల్లి ద్వారా దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు ఇచ్చింది. బాలిక 9వ తరగతి చదువుతున్నప్పుడు 19 ఏళ్ల ప్రియుడి కారణంగా లైంగిక వేధింపులకు గురై గర్భవతి అయినట్లు ఆరోపణలు వచ్చాయి. MTP చట్టం ప్రకారం 24 వారాల లోపు గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తుంది. అయితే, ఈ కేసులో తల్లి, బాధిత బాలిక 28 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి కోరుతూ కోర్టుని ఆశ్రియించారు. ‘‘పునరుత్పత్తి హక్కులలో పిల్లలను కలిగి ఉండాలో, ఎప్పుడు కావాలో ఎంచుకునే హక్కు, పిల్లల సంఖ్యను ఎంచుకునే హక్కు, సురక్షితమైన మరియు చట్టబద్ధమైన గర్భస్రావాలకు ప్రాప్తి చేసే హక్కు కూడా ఉన్నాయి.’’ అని కోర్టు చెప్పింది.
గర్భిణీ బాలికను పరీక్షించడానికి ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదికను కోర్టు పరిశీలించింది, ఇది గర్భం కొనసాగించడం ఆమె మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి హానికరం అని అభిప్రాయపడింది. కోర్టు ఆమె గర్భాన్ని ముగించడానికి అనుమతి మంజూరు చేసింది. ప్రక్రియ తర్వాత పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే, ఆస్పత్రి తప్పనిసరిగా దాని కోసం శ్రద్ధ వహించాలని, బిడ్డకు వైద్య సాయం అందించడంతో పాటు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రం బాధ్యతలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!