Kerala High Court: అత్యాచార బాధితురాలిని రేపిస్ట్ బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయలేము..
Kerala High Court: అత్యాచార బాధిత మహిళ తనపై అత్యాచారం చేసిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయరాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(MTP) చట్టంలోని సెక్షన్ 3(2) ప్రకారం గర్భం కొనసాగించడం వల్ల మహిళ శారీరక లేదా మానసిక ఆరోగ్యానికి తీవ్ర గాయం ఏర్పడితే గర్భాన్ని రద్దు చేయవచ్చు. సెక్షన్ 3 (2) యొక్క వివరణ 2 ప్రకారం, అత్యాచారం వల్ల గర్భం సంభవించినప్పుడు, గర్భం వల్ల కలిగే వేదన గర్భిణీ స్త్రీ యొక్క మానసిక ఆరోగ్యానికి తీవ్రమైన గాయంగా భావించాలి. అందువల్ల, అత్యాచార బాధితురాలు తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వమని బలవంతం చేయకూడదు.’’ అని కోర్టు చెప్పింది.
అత్యాచార బాధితురాలు తన అవాంఛిత గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేయడానికి అనుమతించకపోవడం, ఆమె మాతృత్వపు బాధ్యతను, గౌరవంగా జీవించే ఆమె మానవ హక్కును నిరాకరించినట్లు అవుతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని హైకోర్టు పేర్కొంది. వివాహం కాకుండా గర్భం దాల్చడం చాలా సందర్భాల్లో హానికరం, ముఖ్యంగా లైంగిక వేధింపుల తర్వాత బాధితురాలు, బాధితురాలి శారీరర, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే గాయానికి కారణం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపుల ఫలితంగా వచ్చే గర్భం స్వచ్ఛందంగా, బుద్ధిపూర్వకంగా కోరుకున్న గర్భం కానది చెప్పింది.
Also Read
Read Also: Rapido: హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో ఓటేసిందుకు పోలింగ్ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్..
16 ఏళ్ల అత్యాచార బాధిత యువతి తన తల్లి ద్వారా దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఆదేశాలు ఇచ్చింది. బాలిక 9వ తరగతి చదువుతున్నప్పుడు 19 ఏళ్ల ప్రియుడి కారణంగా లైంగిక వేధింపులకు గురై గర్భవతి అయినట్లు ఆరోపణలు వచ్చాయి. MTP చట్టం ప్రకారం 24 వారాల లోపు గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇస్తుంది. అయితే, ఈ కేసులో తల్లి, బాధిత బాలిక 28 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి కోరుతూ కోర్టుని ఆశ్రియించారు. ‘‘పునరుత్పత్తి హక్కులలో పిల్లలను కలిగి ఉండాలో, ఎప్పుడు కావాలో ఎంచుకునే హక్కు, పిల్లల సంఖ్యను ఎంచుకునే హక్కు, సురక్షితమైన మరియు చట్టబద్ధమైన గర్భస్రావాలకు ప్రాప్తి చేసే హక్కు కూడా ఉన్నాయి.’’ అని కోర్టు చెప్పింది.
గర్భిణీ బాలికను పరీక్షించడానికి ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదికను కోర్టు పరిశీలించింది, ఇది గర్భం కొనసాగించడం ఆమె మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి హానికరం అని అభిప్రాయపడింది. కోర్టు ఆమె గర్భాన్ని ముగించడానికి అనుమతి మంజూరు చేసింది. ప్రక్రియ తర్వాత పిండం సజీవంగా ఉన్నట్లు తేలితే, ఆస్పత్రి తప్పనిసరిగా దాని కోసం శ్రద్ధ వహించాలని, బిడ్డకు వైద్య సాయం అందించడంతో పాటు జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రం బాధ్యతలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో