Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: సొంత బిడ్డను చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక తల్లిని కేరళ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని, ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించిందని కోర్టు పేర్కొంది. ‘మెంటల్ హెల్త్కేర్ యాక్ట్, 2017’ (Mental Healthcare Act) లోని నిబంధనలను అన్వయిస్తూ జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే..
ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళకు పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురయ్యాయి. ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం ఉందంటూ, పుట్టిన 15 నెలల పాప అసలు ఆమె భర్తకే పుట్టలేదంటూ నిత్యం శారీరకంగా, మానసికంగా వేధించేవారు. అదనపు కట్నం కోసం కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఈ నిరంతర వేధింపులు భరించలేక తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె.. 2016 ఫిబ్రవరి 16న 14 పారాసిటమాల్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే ఆమె 15 నెలల బిడ్డ కూడా శ్వాస ఆడక మరణించింది. ఈ కేసులో 2023 నవంబర్లో సెషన్స్ కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
- IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
కోర్టును ఆలోచింపజేసిన సూసైడ్ లెటర్ ..
ఈ ఘటన జరగడానికి ముందు ఆమె పెద్ద మొత్తంలో పారాసిటమాల్ టాబ్లెట్లు మింగడమే కాకుండా, తన మణికట్టును కోసుకుని, ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది. టాబ్లెట్లు మింగిన తర్వాత తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత బిడ్డకు ఏమైందో తనకు తెలియదని సదరు మహిళ కోర్టుకు తెలిపింది. ఈ ఆధారాలన్నీ ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన ‘మెంటల్ హెల్త్కేర్ యాక్ట్-2017’ లోని సెక్షన్ 115 ప్రకారం.. ఎవరైనా వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోనే ఆ పని చేసినట్లు చట్టం భావిస్తుంది. అలాంటి వారికి ఐపీసీ (IPC) కింద శిక్ష విధించకూడదు. “2021లో ఈ కేసు ట్రయల్ స్టార్ట్ అయ్యే నాటికే ఈ చట్టం అమలులో ఉంది. కాబట్టి సెషన్స్ కోర్టే దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సింది. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లే లెక్క. అందువల్ల ఐపీసీ కింద ఆమెకు శిక్ష విధించడం చెల్లదు” అని హైకోర్టు స్పష్టం చేస్తూ ఆమెను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!