Keralam: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్.. ప్రముఖులు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్
- ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం విజయన్
- పోలింగ్ బూత్ల దగ్గర భారీ క్యూ కట్టిన ఓటర్లు
- ఎండకాలం కావడంతో ఉదయాన్నే ఓటేస్తోన్న ప్రజలు
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఎండకాలం భయంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి.
ఇక కేరళంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరులోని ఆర్సీ అమల బేసిక్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కేంద్రమంత్రి సురేష్ గోపీ, నటుడు మోహన్ లాల్, తదితర నాయకులంతా ఉదయాన్నే ఓటు వేశారు. ముఖ్యంగా యువత ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటు వేస్తు్న్నారు.
Also Read
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
మోడీ పిలుపు
కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగడంతో ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించాలని కోరారు.
3 రాష్ట్రాల్లో ఇలా..
అసోంలో 126 స్థానాలకు 722 మంది పోటీ చేస్తున్నారు. కేరళలో 140 స్థానాల్లో 883 అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరుగుతుండగా తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
#WATCH | Keralam CM Pinarayi Vijayan casts his vote in Assembly elections, at Pinarayi RC Amala Basic Upper Primary School in Kannur pic.twitter.com/yIVgSmzdPh
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Kannur | Keralam CM Pinarayi Vijayan arrives at Pinarayi RC Amala Basic Upper Primary School to cast his vote in Assembly elections pic.twitter.com/zgbqY2n63X
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Keralam Assembly Elections 2026 | Union Minister Suressh Gopi casts his vote at Guruvayur Devaswom English Medium School in Guruvayur South Part booth number 137. pic.twitter.com/MSe9Zy6yfO
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Keralam Elections 2026 | Minister and LDF candidate from Nemom, V Sivankutty, and actor Mohanlal arrive at a polling station in Mudavanmugal, Thiruvananthapuram to cast a vote. pic.twitter.com/GfO392q3LF
— ANI (@ANI) April 9, 2026
తాజావార్తలు
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో