Kejriwal: ఎన్నికల ముందు మరో వరాల జల్లు.. అర్చకులకు నెలకు రూ.18 వేల వేతనం
- ఎన్నికల ముందు కేజ్రీవాల్ మరో వరాల జల్లు
- అర్చకులు, గ్రంథులకు నెలకు రూ.18 వేల వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికార పార్టీ ఆప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. అంతేకాకుండా ఆయా వర్గాలపై ఎన్నికల వరాల జల్లులు కూడా కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అన్ని రకాల ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. తాజాగా అర్చకులపై కూడా వరాల జల్లు కురిపించారు.
ఇది కూాడా చదవండి: Harish Shankar: హరీష్ శంకర్ కి కొత్త టెన్షన్?
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని ‘గ్రంథి’లకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన’ను ప్రారంభిస్తామని, దీని కింద ఆలయ పూజారులు, గురుద్వారాలకు నెలవారీగా రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని అరవింద్ కేజ్రీవాల్ సోమవారం వివరించారు. మంచి, చెడు సమయాల్లో ప్రజల జీవితాల్లో పూజారులు, గ్రంథులు మంచి పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ స్థాయిలో వేతనం ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అర్చకులు ప్రాచీన ఆచారాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. వారు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోరని తెలిపారు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన పథకాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా విచారణకు ఆదేశించారు. అలాగే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నగదు తరలింపు ఏర్పాట్లను అడ్డుకోవాలని ఎల్జీ ఆదేశించారు.
ఇది కూాడా చదవండి: TTD: టీటీడీ ప్రతిపాదలనకు సీఎం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్న్యూస్..
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!