Kashmiri Nurse Murder: కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్.. 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు
- కాశ్మీరీ నర్సు హత్య కేసులో ట్విస్ట్
- 35 ఏళ్ల తర్వాత కీలక దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్లోని 35 ఏళ్ల క్రితం హత్యకు గురైన కాశ్మీరీ పండిట్ సరళా భట్ కేసుపై దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. మంగళవారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ కాశ్మీర్లో దాడులు చేపట్టింది. ఎనిమిది ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 35 ఏళ్ల తర్వాత అతి పెద్ద చర్యగా దీన్ని చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి
Also Read
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం మాలిక్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరళా భట్ హత్యకు సంబంధించి గతంలో నిషేధిత జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తుల ఇళ్లపై ఏజెన్సీ దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు.
యాసిన్ మాలిక్ తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్ర నిధుల కేసుకు సంబంధించి అతనికి మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. కానీ ఆయనకు జీవతఖైదు విధించబడింది.
సరళా భట్..
సరళా భట్.. కాశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించింది. వైద్య వృత్తిపై కోరికతో నర్సింగ్ మార్గాన్ని ఎంచుకుంది. శ్రీనగర్లోని షేర్-ఎ-కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తన వృత్తిని కొనసాగిస్తోంది.
1990, ఏప్రిల్ 14న హాస్టల్ గది నుంచి అపహరణకు గురైంది. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన రాడికల్ జిహాదీలు అపహరించి తీసుకెళ్లిపోయారు. అనంతరం నాలుగు రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఏప్రిల్ 19న శ్రీనగర్ డౌన్టౌన్లో శవమై కనిపించింది. దేహంలో బుల్లెట్ గాయాలు కనిపించాయి. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ చేతిలో చీటి రాసి ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిందన్న కోపంతో ఆమెను అత్యంత దారుణంగా చంపేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి: US: ఎయిర్పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?