Kashmiri MBBS Student: ఎంబీబీఎస్ విద్యార్థిని ర్యాగింగ్.. సిద్ధరామయ్యకు లేఖ రాసిన జమ్మూ సీఎం
- కర్ణాటకలోని అల్-అమీన్ మెడికల్ కాలేజీలో కాశ్మీర్ ఎంబీబీఎస్ విద్యార్థిపై దాడి..
- కాశ్మీర్ ఎంబీబీఎస్ విద్యార్థిపై ర్యాగింగ్ పై కర్ణాటక సీఎంకు లేఖ రాసిన ఒమర్ అబ్దుల్లా..
- దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్లోని అనంత్నాగ్కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది. ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలని కోరింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హమీమ్ అనే విద్యార్థి 2019- 2022 బ్యాచ్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
Read Also: Trump vs INDIA: భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..
Also Read
అయితే, ఒక సీనియర్ హమీమ్ను ఆ ప్రాంతం వదిలి వెళ్ళమని ఆదేశించినట్లు జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహామి ఆరోపించాడు. అతను ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. గత సంవత్సరం డైనింగ్ హాల్లో ఒక సీనియర్ మెడికల్ విద్యార్థి హమీమ్ తో గొడవ పడ్డాడు అని చెప్పుకొచ్చారు. సీనియర్ల బృందం అతన్ని అవమానించి, ‘అల్-అమీన్ సెల్యూట్’ చేయమని, పాటలు పాడమని, డ్యాన్స్ చేయమంటూ బెదిరింపులకు దిగినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో సుమారు 8 మంది సీనియర్ విద్యార్థులు హమీమ్ ఉంటున్న హాస్టల్ గదిలోకి చొరబడి దాడి చేసినట్లు చెప్పారు.
Read Also: Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఇక, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి నేను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడాను.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు హామీ ఇచ్చారు.. ఇప్పటి వరకు నలుగురు నిందితులను గుర్తించారు అని కర్ణాటక సీఎం తనకు చెప్పారని జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు
Kashmiri MBBS Student Brutally Ragged and Assaulted in Karnataka’s Al-Ameen Medical College
In a deeply disturbing incident, Hamim, a second-year MBBS student from Anantnag, Kashmir, studying at Al-Ameen Medical College, Bijapur, Karnataka, was subjected to brutal ragging and…
— Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) February 19, 2025
I have spoken to @CMofKarnataka @siddaramaiah ji about this unfortunate incident. He has assured me that the police have filed an FIR & necessary action will be taken. The four accused of perpetrating this ragging/thrashing have been identified. https://t.co/GjAWY5WWRA
— Omar Abdullah (@OmarAbdullah) February 19, 2025
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!