Kashmir: కాశ్మీరు లోయలో.. కనీ వినీ ఎరగని రీతిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kashmir: ప్రకృతి సౌందర్యానికి, మంచు అందాలకు నిలయమైన కాశ్మీర్ భారతదేశపు స్వర్గభూమిగా పేరొందింది. అందుకే పర్యాటకులు అక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా కరోనా, లాక్డౌన్ల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కాశ్మీర్ లోయకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రికార్డు స్థాయిలో ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సంఖ్య కనీ వినీ ఎరగని రీతిలో 20 లక్షలకు పైగా నమోదు కావటం విశేషం. గతంలో మహాఅయితే 15-16 లక్షల మందే వచ్చేవాళ్లు. ఈ సంవత్సరం మాత్రం 8 నెలల్లోనే 2 మిలియన్ల మార్క్ని దాటింది.
ఇది ‘ఆల్ టైం హై’ అని స్థానికులు తెలిపారు. ఆగస్టు చివరి నాటికి కాశ్మీర్ను సందర్శించినవారి సంఖ్య 20.49 లక్షలని చెప్పారు. ఇందులో 10,500 మంది విదేశీయులు కాగా 3.65 లక్షల మంది అమర్నాథ్ యాత్రికులు. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు ఉండటంతో టూరిస్టుల సంఖ్య సరికొత్త చరిత్రను నెలకొల్పుతుందని చెబుతున్నారు. అనూహ్య రీతిలో సందర్శకులు రావటంతో కాశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్, పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్లన్నీ వంద శాతం ఆక్యుపెన్సీని సాధించాయి. శ్రీనగర్లోని హౌజ్ బోట్లు 70-80 శాతం నిండాయి. ఈ నేపథ్యంలో ట్రావెల్ ఏజెంట్లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్లు హర్షం వ్యక్తం చేశారు.
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
Kunamneni Sambasiva Rao: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక
తమ జీవితంలో ఇంత మంది సందర్శకులను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాశ్మీర్కి పర్యాటకులు క్యూ కట్టడంతో బసకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఖాళీ ఇళ్లలో, టెంట్లతో ఏర్పాటుచేసిన గుడారాల్లో వసతి కల్పించేందుకు అనుమతించింది. కాశ్మీర్కి విమానం టికెట్ రేటు రూ.4000 నుంచి రూ.5000 లోపు ఉండటం, శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ల సంఖ్య పెరగటం, ఆతిథ్య సేవలు అందుబాటులో ఉండటం, భద్రతాపరంగా సందర్శకులకు సురక్షిత వాతావరణం నెలకొనటం వంటి కారణాల వల్ల పర్యాటకులు ఊహించనిరీతిలో వస్తున్నారని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ చాప్టర్ ప్రెసిడెంట్ తెలిపారు.
ఆగస్టులో కాశ్మీర్కి వచ్చిన టూరిస్టుల సంఖ్య తగ్గినప్పటికీ పండగ సీజన్ నేపథ్యంలో ట్రావెలర్ల సంఖ్య పెరగనుందని కాశ్మీర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చెప్పారు. టూరిజం ఇండస్ట్రీలో తనకు దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉందని, ‘ది బెస్ట్’ సీజన్ అంటే ఇదేనని పేర్కొన్నారు. ఈ ఏడాది కాశ్మీర్కి వచ్చిన పర్యాటకుల సంఖ్య నెలల వారీగా ఇలా ఉంది.. జనవరిలో 62 వేల 600, ఫిబ్రవరిలో లక్ష చిల్లర, మార్చిలో లక్షా 80 వేలు, ఏప్రిల్లో 2 లక్షల 72 వేలు, మేలో 3 లక్షల 75 వేలు, జూన్లో 3 లక్షల 33 వేలు, జులైలో 2 లక్షల 7 వేలు, ఆగస్టులో లక్షా 54 వేల 900.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!