Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన
- ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి
- జీవితంపై ఆశ కోల్పోయిన బుజ్జి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని కోలారు జిల్లాలో గుండెల్ని పిండేసే దారుణ ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసింది. భర్త మరణాన్ని తట్టుకోలేక.. జీవితంపై ఆశ కోల్పోయి ఇద్దరు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఈ విషాద ఘటన కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా చింతలహళ్లి జోడి గ్రామంలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా సోమల గ్రామానికి చెందిన బుజ్జి, బాబు దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కర్ణాటకలోని కోలారు జిల్లాకు వలస వచ్చారు. అక్కడ స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు సరస్వతి (4), కుమారుడు హేమశ్రీ (15 నెలలు) ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆ కుటుంబంలో పెద్ద విషాదం నిండింది. గత నెల 10వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భర్త బాబు మృతి చెందాడు. కట్టుకున్న భర్త హఠాన్మరణంతో భార్య బుజ్జి తీవ్ర మనస్తాపానికి గురైంది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని వెళ్లదీయడం భారంగా భావించింది. భర్త లేని జీవితంపై భరోసా కోల్పోయిన బుజ్జి.. పిల్లలతో సహా చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నకూతురు సరస్వతి, పసికందు హేమశ్రీలకు ఊపిరి ఆడకుండా చేసి మంచంపైనే చంపేసింది. బిడ్డలిద్దరూ చనిపోయాక బుజ్జి కూడా ఇంట్లోనే ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే లోపలికి వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న చిన్న పిల్లలను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న నంగలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. నిందితురాలు బుజ్జిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. భర్త చనిపోయిన నెల రోజులకే ఇద్దరు పసిబిడ్డలు కూడా తల్లి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..