Site icon NTV Telugu

Karnataka: అమ్మాయితో మాట్లాడినందుకు స్కూల్ విద్యార్థిపై పిడిగుద్దులు..

Karnataka

Karnataka

Karnataka: పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శశికుమార్‌ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు ప్రారంభించామని, పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు బాధితుడిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు.

Read Also: Suicide: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

తనపై దాడి చేసిన వారు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అని బాధిత విద్యార్థి పోలీసులకు చెప్పాడు. నలుగురు నిందితులపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశామని, 19 ఏళ్ల నర్సింగ్ కాలేజీ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, నిందితుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అబ్బాయిలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ్ జంటనగరాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులను సంప్రదించాలని వారికి సూచించామని పోలీసు కమిషనర్ తెలిపారు.

బాలికతో ఎందుకు మాట్లాడుతున్నాడని బాధితురాలిని ముఠా ప్రశ్నించిందని, వారి మధ్య వాగ్వాదం జరగడంతో ముఠా అతనిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు తీవ్రంగా తన్నారని.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version