Karnataka: మసీదులో దసరా పూజ చేసే ప్రయత్నం.. 9 మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mob enters mosque grounds to perform puja on Dussehra: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా ఓ వర్గం ప్రజలు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దసరా సందర్భంగా అక్కడ పూజ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీదర్ మహమూద్ గేవాన్ మదర్సా, మసీదు మైదానాల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.
అక్టోబర్ 6న దసరా సందర్భంగా ఓ గుంపు మసీదు మైదానంలోకి ప్రవేశించి దసరా పూజ నిర్వహించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మసీదు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారసత్వం ప్రదేశంతా పరిరక్షించబడుతోంది. ఈ ఘటనపై మరో వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. లోపలకి ప్రవేశించిన కొంత మంది వ్యక్తలు నినాదాలు చేస్తూ వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
Read Also: Mrunal Thakur: వేశ్యా గృహంలో రెండు వారాలు నరకం చూశాను.. సీత షాకింగ్ కామెంట్స్
‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ గేటు బద్ధలు కొట్టేందుకు జనం ప్రయత్నించారని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ వ్యక్తిని బెదిరించి, మసీదు గోడపై చెత్తను పడేసినట్లు ఆరోపిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే శుక్రవారం తమ నిరసన, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
కాగా.. నిజాం కాలం నుంచి దసరా సందర్భంగా ఈ మసీదులో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మసీదు లోపల సాధారణంగా 2-4 మంది సందర్శించి.. పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎక్కువ సంఖ్యలో మంది రావడంతో వివాదం ఏర్పడిందని జిల్లా ఎస్పీ కిషోర్ బాబు అన్నారు. కొన్నేళ్లుగా హిందువులు మసీదులోకి వెళ్లి చెట్టుకు పూజలు చేస్తున్నారు. హిందువులు ఈ మసీదులోకి వెల్లడం కొత్త కాదని.. అయితే ఈ సారి వివాదం ఏర్పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Visuals from historic Mahmud Gawan masjid & madrasa, Bidar, #Karnataka (5th October). Extremists broke the gate lock & attempted to desecrate. @bidar_police @BSBommai how can you allow this to happen? BJP is promoting such activity only to demean Muslims pic.twitter.com/WDw1Gd1b93
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2022
- Tags
తాజావార్తలు
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!