Karnataka: మసీదులో దసరా పూజ చేసే ప్రయత్నం.. 9 మందిపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mob enters mosque grounds to perform puja on Dussehra: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దసరా సందర్భంగా ఓ వర్గం ప్రజలు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దసరా సందర్భంగా అక్కడ పూజ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 9 మంది కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని బీదర్ మహమూద్ గేవాన్ మదర్సా, మసీదు మైదానాల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు.
అక్టోబర్ 6న దసరా సందర్భంగా ఓ గుంపు మసీదు మైదానంలోకి ప్రవేశించి దసరా పూజ నిర్వహించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మసీదు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారసత్వం ప్రదేశంతా పరిరక్షించబడుతోంది. ఈ ఘటనపై మరో వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. లోపలకి ప్రవేశించిన కొంత మంది వ్యక్తలు నినాదాలు చేస్తూ వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: Mrunal Thakur: వేశ్యా గృహంలో రెండు వారాలు నరకం చూశాను.. సీత షాకింగ్ కామెంట్స్
‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ గేటు బద్ధలు కొట్టేందుకు జనం ప్రయత్నించారని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ వ్యక్తిని బెదిరించి, మసీదు గోడపై చెత్తను పడేసినట్లు ఆరోపిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే శుక్రవారం తమ నిరసన, ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
కాగా.. నిజాం కాలం నుంచి దసరా సందర్భంగా ఈ మసీదులో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మసీదు లోపల సాధారణంగా 2-4 మంది సందర్శించి.. పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎక్కువ సంఖ్యలో మంది రావడంతో వివాదం ఏర్పడిందని జిల్లా ఎస్పీ కిషోర్ బాబు అన్నారు. కొన్నేళ్లుగా హిందువులు మసీదులోకి వెళ్లి చెట్టుకు పూజలు చేస్తున్నారు. హిందువులు ఈ మసీదులోకి వెల్లడం కొత్త కాదని.. అయితే ఈ సారి వివాదం ఏర్పడిందని పోలీసు అధికారులు వెల్లడించారు.
Visuals from historic Mahmud Gawan masjid & madrasa, Bidar, #Karnataka (5th October). Extremists broke the gate lock & attempted to desecrate. @bidar_police @BSBommai how can you allow this to happen? BJP is promoting such activity only to demean Muslims pic.twitter.com/WDw1Gd1b93
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2022
- Tags
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!