Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- రాజీనామా చేసినా, పవర్ చూపించాలని సిద్ధరామయ్య ఆరాటం
- ‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు ప్రతిపాదన
- డీకేకు చెక్ పెట్టే వ్యూహమని చర్చ
- సిద్ధరామయ్య ప్రతిపాదనను తిరస్కరించిన హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానినిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన చేశారు. తన వారికి మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, రాజీనామా చేసినా కూడా అధికారంలో ఉండాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రభుత్వంలో లేనప్పటికీ, రాజకీయంగా శక్తివంతంగా ఉండేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ‘సమన్వయ కమిటి’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం పనితీరు, పార్టీ ఆశయాలకు మధ్య సమన్వయం చేస్తుంది. ఈ కమిటీకి సిద్ధరామయ్య బాధ్యత వహించాలని ఆశించారు. అయితే, సిద్ధరామయ్య నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది.
Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
2018లో కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో హెచ్డీ కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ, సిద్ధరామయ్య సమన్వయ కమిటీకి నేతృత్వం వహించారు. ఆయన ప్రభుత్వం లేనప్పటికీ, ప్రభుత్వంలో సీఎం కానీ సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థనే సిద్ధరామయ్య కోరుకున్నారు. అయితే, ఆ సమయంలో జేడీఎస్, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కమిటీ ఎందుకని కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య ప్రతిపాదనను తిరస్కరించింది.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!