Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్
- ఢిల్లీలో జరిగిన సమావేశంపై తేల్చేసిన కాంగ్రెస్
- డీకే.శివకుమార్ అనుచరుల్లో నిరాశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తినలో మకాం వేయడంతో ఈసారి ముఖ్యమంత్రి మార్పు ఖాయమని వార్తలు వచ్చాయి. అంతే విధంగా మంగళవారం ఉదయం నుంచి కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఇక రాహుల్ గాంధీ అయితే రహస్య చర్చలు కూడా జరిపారు. దీంతో ఈసారి డీకే.శివకుమార్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించవచ్చని జాతీయ మీడియా జోరుగా వార్తలు ప్రచారం చేశాయి. ప్రియాంకాగాంధీ కూడా డీకే.శివకుమార్కు మద్దతు తెలిపినట్లుగా ప్రచారం జరిగింది. కానీ 6 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత కేసీ.వేణుగోపాల్ తూచ్.. అదేమీ కాదంటూ కొట్టిపారేశారు. దీంతో డీకే అనుచరుల్లో నీళ్లు చల్లినట్లైంది.
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలను కేసీ.వేణుగోపాల్ కొట్టిపారేశారు. మంగళవారం జరిగిన చర్చలు కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమేనని తేల్చి చెప్పారు. రాబోయే రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వ మార్పు జరుగుతోందన్న వదంతులను తోసిపుచ్చారు. “ఈరోజు చర్చ కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూనే జరిగింది. మీరు ఊహించినదేదీ నిజం కాదు” అని అన్నారు. ‘‘మేము ఒక సమావేశం నిర్వహించాం. సీఎం, డీప్యూటీ సీఎం, రణదీప్ హాజరయ్యారు. ఈరోజు చర్చ మొత్తం రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లపైనే కేంద్రీకృతమైంది. ఊహాగానాలు ఆపండి.’’ అని వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ కర్ణాటక ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా, సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.
2023లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఖాయమని ఆయన మద్దతుదారులు చేస్తున్న వాదనల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం కర్ణాటక నాయకత్వ సమీకరణంపై కొత్త ఊహాగానాలకు దారితీసింది. అయితే సమావేశం అనంతరం అదేమీ కాదని తేల్చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?