Congress: విదేశాల జోక్యంతో తత్వం బోధపడింది… రాహుల్ విషయంలో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై పలు విదేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, జర్మనీలు పరిస్థితిని గమనిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశాయి. అయితే నిన్న జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీ అనర్హతపై స్పందించింది. ‘‘ భారత్ లో రాహుల్ గాంధీకి జైలు శిక్ష, లోక్ సభ సభ్యత్వం కోల్పోవడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం, ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. రాహుల్ గాంధీ పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు.’’ అని జర్మనీ పేర్కొంది.
అయితే రాహుల్ గాంధీ విషయంపై స్పందించినందుకు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎలా అనగదొక్కుతున్నారో రాహుల్ గాంధీ ఉదంతం నిదర్శమని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Radhika Apte: 14 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అవతారం ఎత్తిన సాధారణ హౌజ్ వైఫ్
అయితే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయి. విదేశాల జోక్యం కాంగ్రెస్ కోరుతోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తోంది. దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భారతదేశ సమస్యలను, ప్రజాస్వామ్యాన్ని మేం రక్షించుకోలమని నిన్న కాంగ్రెస్ తెలిపింది. దీంతో ఇతరుల జోక్యం అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా స్పందించారు. మనం ముందుకు వెళ్లడానికి మనకు అండదండలు అవసరం లేదని నేను భావిస్తున్నాను, విదేశాల నుంచి మనకు ఆమోదం అవసరం లేదని సిబల్ అన్నారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో ప్రసంగిస్తూ.. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అని రాహుల్ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం దావా వేశారు. ఇటీవల సూరత్ కోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే అతడు పదవికి అనర్హుడు అవుతాడు. ఈ చట్టం ప్రకారమే రాహుల్ గాంధీ పదవి ఊడింది.
తాజావార్తలు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!