PM Modi: ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్
- ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు..
- ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్..
- మహిళా కమాండో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోలు ఉన్నారానే విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చ కొనసాగుతుంది. అయితే, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన ఓ ఫొటోలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: Fengal Cyclone : గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఫెంగల్.. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
Also Read
అయితే, దీనికి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. ఆమె ప్రధాని భద్రతా బృందం అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు చర్చ పెట్టారు. దీంతో ప్రధాని మోడీ భద్రత వలయంలో మహిళా కమాండో ఉన్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఫోటో వైరల్ కావడంపై భద్రతా వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఎస్పీజీలో 100 మంది మహిళా కమాండోలు ఉన్నారు.. అలాగే, మరి కొందరు మహిళా ఎస్పీజీ కమాండోలు ‘క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్’లో సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: Manipur Violence: 13 రోజుల విరామం తర్వాత.. మణిపూర్లో నేటి నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్
కాగా, ఈ చిత్రంలో కన్పించిన మహిళ మాత్రం ఎస్పీజీ టీమ్ లో భాగం కాదని క్లారిటీ ఇచ్చాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని పేర్కొన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ లో అసిస్టెంట్ కమాండెంట్గా వ్యవహరిస్తున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఇక, ఆమె పేరు, ఇతర వివరాలను మాత్రం అధికారిక వర్గాలు వెల్లడించలేదు.
తాజావార్తలు
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!