Vikram Batra: కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Batra: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా(77) కన్నుమూశారు. ఆప్ మాజీ నేత అయిన కమల్ కాంత్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్లో మరణించారు. ఆమె మరణానికి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎక్స్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు.
కమల్ కాంత్ బాత్రా 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ నుంచి ఆప్ తరుపున ఎంపీగా పోటీ చేశారు. అయితే, ఆప్ పనితీరు, సంస్థాగత నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని నెలల క్రితం పార్టీని వీడారు. ప్రధాని మోడీ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని,తన వాగ్దానాలన్నింటిని నేరవేర్చాలని ఆదే తన సూచన అని అన్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
Read Also: Sonia Gandhi: కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుంది.. సోనియా గాంధీ రాజ్యసభ సీటుపై బీజేపీ..
కార్గిల్ యుద్ధంలో వీరోచిత పోరాటంలో వీర మరణం పొందిన కెప్టెన్ విక్రామ్ బాత్రా(24) తల్లిగా ఆమె అందరికి సుపరిచితం. 1999లో పాకిస్తాన్తో భారత్ కార్గిల్ యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా హీరోగా నిలిచారు. అనేక కీలకమైన పాయింట్లను చేజిక్కించుకున్నారు. మరణానంతరం అత్యున్నత యుద్ధకాల శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఇవ్వబడింది. అతని పరాక్రమానికి గుర్తుగా బాత్రాను “టైగర్ ఆఫ్ ద్రాస్”, “కార్గిల్ సింహం”, “కార్గిల్ హీరో” పిలుస్తుంటారు.
కెప్టెన్ బాత్రా జీవిత కథ ఆధారంగా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా ‘షేర్షా’ చిత్రం 2021లో విడుదలైంది. కార్గిల్ యుద్ధంలో అత్యంత క్లిష్టమైన టార్గెట్ పాయింట్ 4875ని శత్రువుల నుంచి విజయవంతంగా చేజిక్కించుకోవడంలో బాత్రా పరాక్రమం తిరుగులేనిది. కెప్టెన్ బత్రాకు కోడ్ నేమ్ ‘షేర్షా’గా ఇచ్చారు. యుద్ధంలో పేలుడులో కాళ్లకు తీవ్రగాయాలైన లెఫ్టినెంట్ నవీన్ అనబేరు అనే అధికారిని రక్షించేందుకు కెప్టెన్ బాత్రా తన బంకర్ నుంచి పరిగెత్తి కాపాడే క్రమంలో శత్రువుల కాల్పుల్లో మరణించారు.
తాజావార్తలు
-
Vastu Tips: మనీ ప్లాంట్ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!