West Bengal: 61 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష.. బాలిక హత్యాచారం కేసులో సంచలనం..
- బెంగాల్ మైనర్ హత్యాచార కేసులో సంచలనం..
- కేవలం 61 రోజుల్లో మరణశిక్ష విధించిన కోర్టు..
- 9 బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు ముస్తాకిన్ సర్దార్..
- బెంగాల్ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన 19 ఏళ్ల నిందితుడికి పశ్చిమ బెంగాల్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 61 రోజుల తర్వాత నేరారోపణ రుజువు కావడంతో అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్లో అక్టోబర్ 04న 9 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ముస్తాకిన్ సర్దార్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు.
అదే రోజు రాత్రి ఆమె కుటుంబీలకు జైనగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 2.5 గంటల్లో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాలిక మృతదేహం స్వాధీనం చేసుకున్న తర్వాత, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
Read Also: Rajasthan: శ్రీకృష్ణ టెంపుల్కు రికార్డ్ విరాళాలు.. కేజీ గోల్డ్, రూ.23 కోట్ల నగదు
అక్టోబర్ 30న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేశారు. రికార్డు సమయంలో కేవలం 25 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయింది. నవంబర్ 04న విచారణ ప్రారంభమైంది. నవంబర్ 26న విచారణ ముగించే సమయానికి 36 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డ్ చేసింది. ఈ తీర్పును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారు. మహిళపై నేరాలను తమ ప్రభుత్వం ఎప్పుడూ సహించదని ఆమె ఎక్స్లో ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన సమయంలోనే ఈ ఘటన జరగడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తాజాగా ఈ కేసులో నిందితుడు సర్దార్కి మరణశిక్ష విధిండచంతో పాటు మైనర్ బాలిక కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!