NTV Telugu Site icon

Patra Chawl land scam case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Sanjay Raut

Sanjay Raut

Patra Chawl land scam case: పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు. సోమవారం ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు అతని కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. ఈ కేసులో జూలై 31న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల విచారణ తర్వాత ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకొని, అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆగస్టు 4 వరకు వరకు ఈడీ కస్టడీకి పంపింది. అనంతరం మళ్లీ 8 వరకు కస్టడీని పొడిగించింది.

Amit Shah and Junior NTR: అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీలో జరిగిన చర్చ ఇదే.. బయటపెట్టిన కిషన్‌రెడ్డి

అనంతరం ఆయనకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ప్రస్తుతం మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 28న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్‌కు సమన్లు ​​జారీ చేసింది.