JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda – CJP Leaders: కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నాయకుల సమావేశం ముగిసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని, వాటిని పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని సీజేపీ నేతలు వెల్లడించారు. సమావేశం ప్రశాంత వాతావరణంలో జరిగిందని, తమ ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీజేపీ ప్రతినిధి బృందం జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని, ప్రభుత్వం తమ సమస్యలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
సమావేశం తర్వాత తమ మద్దతుదారులకు శాంతిని పాటించాలని సీజేపీ నేతలు కీలక విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలను కాపాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనకారులను బలవంతంగా తొలగించే ఆలోచన లేదని వర్గాల సమాచారం. ఈ సందర్భంగా వాళ్లు డిమాండ్స్ గురించి మాట్లాడుతూ.. సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
మరోవైపు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంపై స్పందించారు. ఆదివారం ఉదయం నిరసనకారుల ప్రతినిధులతో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఉదయం 11:50 గంటలకు మొదలైన చర్చల్లో మొదట మౌఖికంగా సమస్యలను విన్నామని, అనంతరం సాయంత్రం లిఖితపూర్వక వినతిపత్రంపై చర్చించామని పేర్కొన్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని తెలిపారు. నిరసనకారులు ఆందోళన విరమించి సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు సహకరించాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.
आज सुबह पहली बार प्रदर्शनकारियों की ओर से सरकार के साथ बातचीत करने का प्रस्ताव आया और सुबह 11:50 AM से ही हमारी बातचीत जारी है।
सौहार्दपूर्ण वातावरण में मुलाकात हुई। उनके डेलीगेशन के साथ विस्तार से पहले मौखिक चर्चा हुई और उनके द्वारा लगभग 4 बजे मुझे लिखित याचिका दी गई।
मैंने… pic.twitter.com/HLCl20RBSp
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2026
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!