Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’.. 31 మంది సభ్యులు.. లిస్ట్ ఇదే..
- వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ..
- 31 మంది సభ్యులతో ఏర్పాటు..
- కమిటీలో లోక్సభ..రాజ్య సభ నుంచి సభ్యులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడిగా, మత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బిల్లుపై ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది.
కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉండనున్నారు. తరుపది సమావేశాల్లో కమిటీ తమ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. లోక్సభ నుంచి సభ్యులుగా ఎన్నికైన వారిలో 12 మంది అధికార బీజేపీ కూటమి అయిన ఎన్డీయే నుంచి ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 08 మంది, ప్రతిపక్షం నుంచి 09 మంది ఉన్నారు. రాజ్యసభ నుంచి బీజేపీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ కూటమికి చెందిన ఎంపీలు నలుగురితో పాటు ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా త్వరలోనే కమిటీకి అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. బీజేపీకి చెందిన జగదాంబికా పాల్ అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన
లోక్సభ నుంచి సభ్యులు-వారి పార్టీలు:
బీజేపీ నుంచి: జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిత్ గంగోపాధ్యాయ, DK అరుణ
కాంగ్రెస్ నుంచి: గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్
సమాజ్ వాదీ పార్టీ: మొహిబుల్లా
తృణమూల్ కాంగ్రెస్: కళ్యాణ్ బెనర్జీ
డీఎంకే: ఏ రాజా
టీడీపీ: లావు శ్రీకృష్ణ దేవరాయలు
జేడీయూ: దిలేశ్వర్ కమైత్
శివసేన (యూబీటీ): అరవింద్ సావంత్
ఎన్సీపీ(శరద్ పవార్): సురేష్ మాత్రే
శివసేన: నరేష్ మాస్కే
ఎల్జేపీ-రామ్ విలాస్: అరుణ్ భారతి
ఎంఐఎం: అసదుద్దీన్ ఓవైసీ
రాజ్యసభ సభ్యులు:
బీజేపీ : బ్రిజ్ లాల్, మేధా విశ్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్
కాంగ్రెస్: సయ్యద్ నసీర్ హుస్సేన్
టీఎంసీ: మహ్మద్ నడిముల్ హక్
వైఎస్సార్సీపీ: విజయసాయి రెడ్డి
డీఎంకే : మహ్మద్ అబ్దుల్లా
ఆప్: సంజయ్ సింగ్
నామినేటెడ్ సభ్యుడు: ధర్మస్థల వీరేంద్ర హెగ్డే
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!