Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- జోధ్పూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ నిర్వాకం
- 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జోధ్పూర్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నిర్వాకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యార్థులతో సహా విద్యావేత్తలను విభ్రాంతికి గురి చేసింది. మార్కుల మెమోలో 100 మార్కులకు గాను 123 మార్కులు వేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
జోధ్పురిలోని ఎంబీఎం ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 100 మార్కులకు రెండవ సెమిస్టర్ జరిగింది. అయితే మార్కుల మెమోలో 100 మార్కులకు గాను ఒకచోట 123 మార్కులు.. ఇంకొక చోట 119 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Singh: బీజేపీలో చేరిక గాయకుడు పవన్ సింగ్.. బీహార్లో పోటీ కోసమేనా?
విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచిన ఫలితాలను చూసి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఇలాంటి పొరపాట్లు కనిపించాయి. అయితే దీనిపై గందరగోళం నెలకొనగానే పరిపాలన విభాగం ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తొలగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం విమర్శలకు దారి తీసింది. అయితే విశ్వవిద్యాలయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని సమాచారం. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది. చాలా సార్లు సర్టిఫికెట్లు దిద్దుబాట్లు చేసిన దాఖలాలు చాలానే ఉన్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
ఫలితాలను వైట్సైట్లో విడుదల చేసే ముందు చూసుకోకుండా ఎలా విడుదల చేస్తారని ఒక విద్యార్థి యూనివర్సిటీ పరిపాలన విభాగాన్ని ప్రశ్నించాడు. అంతర్గత మార్కులను అంతర్గతేతర మార్కులతో పాటు తప్పుగా అప్లోడ్ చేశారని ఆరోపించాడు. తప్పు పూర్తిగా పరిపాలనాపరమైనదే అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు సరిదిద్దు కోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయాడు.
జరిగిన పొరపాటును వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అజయ్ శర్మ తప్పును అంగీకరించారు. పరీక్షా సంస్థ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అంతర్గత మార్కులు 15-20 నిమిషాల పాటు అనుకోకుండా అప్లోడ్ అయ్యాయని పేర్కొన్నారు. లోపం గుర్తించిన వెంటనే ఫలితాలు తొలగించినట్లు చెప్పారు. బాధ్యతాయుతమైన ఏజెన్సీకి నోటీసు జారీ చేశామన్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!