Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- జోధ్పూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ నిర్వాకం
- 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జోధ్పూర్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నిర్వాకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యార్థులతో సహా విద్యావేత్తలను విభ్రాంతికి గురి చేసింది. మార్కుల మెమోలో 100 మార్కులకు గాను 123 మార్కులు వేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
జోధ్పురిలోని ఎంబీఎం ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 100 మార్కులకు రెండవ సెమిస్టర్ జరిగింది. అయితే మార్కుల మెమోలో 100 మార్కులకు గాను ఒకచోట 123 మార్కులు.. ఇంకొక చోట 119 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Singh: బీజేపీలో చేరిక గాయకుడు పవన్ సింగ్.. బీహార్లో పోటీ కోసమేనా?
విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచిన ఫలితాలను చూసి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఇలాంటి పొరపాట్లు కనిపించాయి. అయితే దీనిపై గందరగోళం నెలకొనగానే పరిపాలన విభాగం ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తొలగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం విమర్శలకు దారి తీసింది. అయితే విశ్వవిద్యాలయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని సమాచారం. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది. చాలా సార్లు సర్టిఫికెట్లు దిద్దుబాట్లు చేసిన దాఖలాలు చాలానే ఉన్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
ఫలితాలను వైట్సైట్లో విడుదల చేసే ముందు చూసుకోకుండా ఎలా విడుదల చేస్తారని ఒక విద్యార్థి యూనివర్సిటీ పరిపాలన విభాగాన్ని ప్రశ్నించాడు. అంతర్గత మార్కులను అంతర్గతేతర మార్కులతో పాటు తప్పుగా అప్లోడ్ చేశారని ఆరోపించాడు. తప్పు పూర్తిగా పరిపాలనాపరమైనదే అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు సరిదిద్దు కోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయాడు.
జరిగిన పొరపాటును వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అజయ్ శర్మ తప్పును అంగీకరించారు. పరీక్షా సంస్థ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అంతర్గత మార్కులు 15-20 నిమిషాల పాటు అనుకోకుండా అప్లోడ్ అయ్యాయని పేర్కొన్నారు. లోపం గుర్తించిన వెంటనే ఫలితాలు తొలగించినట్లు చెప్పారు. బాధ్యతాయుతమైన ఏజెన్సీకి నోటీసు జారీ చేశామన్నారు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!