Jayalalithaa Death Case: జయలలిత వైద్యంలో ఎలాంటి లోపాలు లేవు..ఎయిమ్స్ డాక్టర్స్ ప్యానెల్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayalalitaa was given proper treatment. Doctors Panel Report: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సరైన వైద్య చికిత్సనే అందించారని.. వైద్య విధానాల ప్రకారంమే చికిత్స చేశారని, ట్రీట్మెంట్ లో ఎలాంటి లోపాలు లేవని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల ప్యానెల్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన అపోలో ఆస్పత్రికి ఉపశమనం లభించినట్లు అయింది.
2016లో జయలతిత తీవ్ర అనారోగ్యంతో మరణించారు. ఆమెకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స చేశారు. అయితే వైద్యులు ఎక్మో వంటి అత్యాధునిక వైద్యవిధానాల ద్వారా ట్రీట్మెంట్ అందించినా.. ఆమె మరణించారు. అయితే ఆమెకు జరిగిన ట్రీట్మెంట్ పై రాజకీయంగా పలు వివాదాలు చెలరేగాయి. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయలలితకు జరిగిన ట్రీట్మెంట్ పై విచారణ చేయాలని ఆరుముఘస్వామి కమిషన్ను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆరుముఘస్వామి కమిషన్కు సహాయం చేయడానికి ఎయిమ్స్ డాక్టర్ ప్యానెల్ ను నియమించింది.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
Read Also: Constable Surendra Incident: కానిస్టేబుల్ సురేంద్ర కేసు.. డీఐజీ ఏమన్నారంటే?
జయలలిత ఆరోగ్య పరిస్థితి, సంఘటనలు, చికిత్స జరిగిన తీరును ప్యానెల్ పూర్తిగా విచారించింది. అపోలో ఆస్పత్రి అందించిన చికిత్సతో పూర్తిగా ఏకీభవించింది ప్యానెల్. జయలలిత సన్నిహితులు, ఆమెకు వైద్యం అందించిన డాక్టర్లు, అప్పటి వైద్యశాఖ మంత్రి విజయభాకర్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ ఇలా ఆమె మరణంతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని మొత్తం 157 మందిని ఆరుముఘస్వామి కమిషన్ నవంబర్ 2017లో విచారించింది. ఇదిలా ఉంటే 2019లో అపోలో ఆస్పత్రి విచారణ ప్యానెల్ పై మధ్యంతర స్టే విధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ ప్యానెల్ తన నిబంధనలను దాటి వ్యవహరిస్తోందని.. ఆపోలో హాస్పిటల్స్ పై బాధ్యతను కట్టడి చేయడానికి ప్రయత్నించిందని పిటిషన్ లో పేర్కొంది. అయితే వీటిని మద్రాస్ హైకోర్ట్ తిరస్కరించింది.
ఆ తరువాత, మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది అపోలో హాస్పిటల్. దీంతో జయలలితకు అందించిన చికిత్సను అర్థం చేసుకోవడాని ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ ను నియమించాలని ఆదేశించింది. వైద్య రికార్డుల ఆధారంగా.. గెండె వైఫల్యానికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయని.. హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడ్, ఆస్తమాటిక్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ మరియు అటోపిక్ డెర్మటైటిస్ హిస్టరీ కూడా ఉందని.. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే సమయానికి ఆమెకు షుగర్ అనియంత్రిత స్థాయిలో ఉందని గుర్తించింది. దీంతో వైద్య ప్రక్రియల్లో ఎలాంటి లోపాలు లేవని ఎయిమ్స్ మెడికల్ ప్యానెల్ రిపోర్ట్ ఇచ్చింది.
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!