RSS Remarks Case: ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్
- ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చిన బాలీవుడ్ గీత రచయితకు బిగ్ రిలీఫ్..
- జావేద్ అక్తర్ను నిర్థోషిగా పేర్కొంటు ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS Remarks Case: బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్కు పెద్ద ఉపశమనం దొరికింది. 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని తాలిబాన్తో పోల్చినందుకు అతనిపై దాఖలైన పరువు నష్టం ఫిర్యాదు ఉపసంహరించుకోబడింది. అయితే, ఫిర్యాదుదారుడు కేసును ఉపసంహరించుకోవడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు పేర్కొంది. ఈ కేసును ములుంద్ కోర్టులో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ SD చక్కర్ విచారించారు. నవంబర్ 8న ఈ కేసును పరిష్కరించగా.. ఈరోజు (సోమవారం) ఆర్డర్ కాపీ అందుబాటులోకి వచ్చింది.
Read Also: Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
అయితే, 2021లో జావేద్ అక్తర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ను తాలిబాన్తో పోల్చడంతో వివాదానికి దారి తీసింది. ఆర్ఎస్ఎస్ నేత, లాయర్ సంతోష్ దూబే మొదట్లో అక్తర్కు లీగల్ నోటీసు జారీ చేశాడు.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. తన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే రూ. 100 కోట్ల నష్ట పరిహారం చెల్లించమని బెదిరించాడు. దానికి బాలీవుడ్ గీత రచయిత అక్తర్ అంగీకరించకపోవడంతో.. దూబే 2022లో క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, అక్తర్ దానిని ముంబై సెషన్స్ కోర్టులో సవాలు చేయగా.. మార్చ్ 2023లో సమన్లను సెషన్స్ కోర్టు సమర్థించింది.
Read Also: West Bengal Violence: బెంగాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు.. 15 మంది అరెస్ట్
ఇక, RSS భావజాలాన్ని తాలిబాన్తో పోల్చడంతో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలతో పాటు సంస్థ పరువు, ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించాడని సంతోష్ దూబే పిటిషన్ లో పేర్కొన్నారు. అనేక వాయిదాల తర్వాత ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో ఫిర్యాదుదారుడు కేసు విత్ డ్రా చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ గీత రచయిత జావేద్ ఆక్తర్ ను నిర్థోషిగా తేల్చుతూ ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!