Cross-border marriage: జైనాబ్గా మారిన జస్ప్రీత్.. పాక్ వ్యక్తిని పెళ్లాడేందుకు మతం మారిన భారతీయ యువతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cross-border marriage: ఇటీవల కాలంలో సరిహద్దు దాటి ప్రేమలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్కి చెందిన పలువురు యువతీయువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ యువతి, పబ్జీ ద్వారా పరిచయమైన లవర్ సచిన్ కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్కి చెందిన ఓ యువతి, పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది.
కాగా, సదరు అమ్మాయి, పాక్ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇస్లాంని స్వీకరించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన జస్ప్రీత్ కౌర్ ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ సియాల్కోట్కి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంది. లూధియానా నివాసి జస్ప్రీత్ కౌర్ పెళ్లికి ముందు తన పేరును జైనబ్గా మార్చుకుంది. జామియా హనాఫియా సియాల్ కోట్ జారీ చేసిన సర్టిఫికేట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
నివేదిక ప్రకారం.. జస్ప్రీత్, అర్సలాన్ల మధ్య జనవరి 16న పాకిస్తాన్లో తొలిసమావేశం జరిగింది. మతపరమైన యాత్ర కోసం ఆమె ఏప్రిల్ 15 వరకు ఆమెకు వీసా లభించింది. మ్యూనిచ్ నుంచి ఆమెకు ఇండియన్ పాస్పోర్టుపై వీసా లభించింది. జస్ప్రీత్ మరియు ఆమె తల్లిదండ్రులు భారతీయులేనని, అయితే వారు జర్మనీలో నివసిస్తున్నారని జామియా హనీఫియా సియాల్కోట్ అధికారులు తెలిపారు.
Read Also: Ukraine War: రష్యా తరుపున యుద్ధంలో భారతీయులు.. కేంద్రం కీలక సూచనలు..
పాక్ అధికారుల ప్రకారం.. జామియా హనాఫియాలో ఇస్లాం మతంలోకి మారిన రెండు వేల మందికి పైగా ముస్లిమేతరులలో జస్ప్రీత్ కౌర్ ఒకరు. జస్ప్రీత్, అర్సలాన్ ముందుగా విదేశాల్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను అర్సలాన్ పాకిస్తాన్ ఆహ్వానించాడు. ఆ తర్వాత జస్ప్రీత్ మతపరమైన యాత్ర కోసం పాక్ వీసా అఫ్లై చేసుకుంది. జనవరి 16న ఆమె పాకిస్తాన్ చేరుకుంది, ఆ తర్వాత ఇస్లాం స్వీకరించి వివాహం చేసుకుంది.
ఇటీవల కాలంలో సీమా హైదర్ మాత్రమే కాకుండా.. జోధ్పూర్ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అమీనా అనే అమ్మాయి భారత్ వచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంజూ థామన్ అనే వివాహిత భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లింది. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత అంజూ క్రిస్టియన్ నుంచి ఇస్లాం మతంలోకి మారి ఫాతిమా అనే పేరు మార్చుకుంది.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..