Jammu Kashmir: కాశ్మీర్ లో పట్టుబడ్డ లష్కరేతోయిబా ఉగ్రవాదులు.. ఆయుధాలు, పాక్ జెండాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దొరికారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొరికిన ముగ్గురు ఉగ్రవాదులను షరీఫ్ అష్రఫ్, సక్లైన్ ముస్తాక్, తౌఫీక్ హసన్ షేక్ లుగా గుర్తించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో గొరిపురా నుంచి బొమ్మై వైపు వస్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీరి వద్ద నుంచి మూడు హ్యండ్ గ్రెనెడ్లు, తొమ్మిది పోస్టర్లు, 12 పాకిస్తాన్ జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: Munawar Faruqui: మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు..
అరెస్ట్ అయిన ఉగ్రవాదులు నిషేధిక లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారు. వీరంతా బయట నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వలస వచ్చిన కూలీలు, సాధారణ పౌరులపై, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాశ్మీర్ హిందువులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల యాపిల్ తోటలో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతకు ముందు ఇలాగే కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, ఓ మహిళా ఉపాధ్యాయురాలిని, రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపారు. లష్కరే తోయిబాతో పాటు దీనికి అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడులకు తెగబడుతోంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..