Jammu Kashmir: కాశ్మీర్ లో పట్టుబడ్డ లష్కరేతోయిబా ఉగ్రవాదులు.. ఆయుధాలు, పాక్ జెండాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Lashkar Terrorists Arrested In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. లష్కరే తోయిబాకు వీరంతా ఓవర్ గ్రౌండ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 22 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నారు. సోపోర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమై చౌక్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దొరికారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దొరికిన ముగ్గురు ఉగ్రవాదులను షరీఫ్ అష్రఫ్, సక్లైన్ ముస్తాక్, తౌఫీక్ హసన్ షేక్ లుగా గుర్తించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో గొరిపురా నుంచి బొమ్మై వైపు వస్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ముగ్గురు పారిపోయేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వీరి వద్ద నుంచి మూడు హ్యండ్ గ్రెనెడ్లు, తొమ్మిది పోస్టర్లు, 12 పాకిస్తాన్ జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
Read Also: Munawar Faruqui: మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు..
అరెస్ట్ అయిన ఉగ్రవాదులు నిషేధిక లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారు. వీరంతా బయట నుంచి కాశ్మీర్ ప్రాంతానికి వలస వచ్చిన కూలీలు, సాధారణ పౌరులపై, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. ఇటీవల కాలంలో ఉగ్రవాదులు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాశ్మీర్ హిందువులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల యాపిల్ తోటలో పనిచేసుకుంటున్న వ్యక్తిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అంతకు ముందు ఇలాగే కాశ్మీర్ పండిట్ రాహుల్ భట్, టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్, ఓ మహిళా ఉపాధ్యాయురాలిని, రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ తో పాటు బీహార్ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తులను కాల్చి చంపారు. లష్కరే తోయిబాతో పాటు దీనికి అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడులకు తెగబడుతోంది.
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి.. మరో సూపర్హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!