Jammu Kashmir: పాక్ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..
- పాకిస్తాన్ని పట్టించుకునేది లేదు..
- జమ్మూ కాశ్మీర్ ప్రాజెక్టు పనులు వేగవంతం..
- ఆదేశాలు జారీ చేసిన సీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లోని రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులైన రాటిల్, దుల్ హస్తి ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఉన్న అడ్డంకుల్ని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Balochistan: ‘‘దమ్ముంటే క్వెట్టా దాటి బయటకు రండి’’.. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
Also Read
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
- Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటల్ దల్లూ కిష్ట్వార్ జిల్లాలోని రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులపై పాకిస్తాన్ పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, ఈ ప్రాజెక్టులు ఇండస్ వాటర్ ట్రీటీకి అనుగుణంగా ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని భారత్ వాదించింది. అయితే, ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్ అభ్యంతరాలను పట్టించుకునే పరిస్థితి లేనే లేదు.
850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టు, 390 మెగావాట్ల దుల్ హస్తి జలవిద్యుత్ కేంద్రాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాటిల్, దుల్ హస్తి ప్రాజెక్టులతో పాటు, కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై మరో రెండు జల విద్యుత్ కేంద్రాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని బలిగొన్న తర్వాత, భారత్ 1960 నాటి ఈ ఒప్పందాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..