Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది. ఖాన్ యూనిస్ నగరం నుంచి ఇజ్రాయిల్ కొంత మంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు ఆదివారం తెలిపారు. రఫా బార్డర్ వద్ద మెరుగైన మానవతా కార్యక్రమాల కోసం ఈ చర్య తీసుకున్నట్లు ఇజ్రాయిల్ తెలుపుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ మధ్య ప్రారంభమైన గాజా యుద్ధం ప్రస్తుతం 7వ నెలకు చేరుకుంది. మరోవైపు సంధి వైపు చర్చలు జరుగుతున్నాయి.
అంతకు ముందు గాజా దక్షిణ భాగంలో ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై తాము దాడి చేస్తామని గత కొన్ని వారాలుగా ఇజ్రాయిల్ చెబుతూ వస్తోంది. అయితే, ఆ ప్రాంతంలో మిలియన్ మంది జనాభా ఉండటంతో అమెరికా, ఇతర దేశాలు ఈ చర్యల్ని సమీక్షించాలని ఇజ్రాయిల్ని కోరాయి. తీరా ఆ ప్రాంతం నుంచే బలగాల ఉపసంహరణ జరిగింది.
Also Read
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
Read Also: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ పాక్షిక ఉపసంహరణ ఇరాన్ దాడి చేస్తుందనే అనుమానాల నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల సిరియా డమాస్కస్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ ఎంబసీ లక్ష్యంగా జరిపిన దాడిలో ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇరాన్ అత్యున్నత మిలిటరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్ తన బలగాలను గాజా నుంచి ఉపసంహరించుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రంజాన్ తర్వాత ఎప్పుడైనా ఇరాన్ దాడి చేయవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బాంబ్ షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థకు అంతరాయాన్ని సృష్టిస్తోంది. ఇలా చేయడం వల్ల గైడెడ్ మిస్సైల్స్, డ్రోన్ల దాడిని అరికట్టవచ్చని ఇజ్రాయిల్ భావిస్తోంది.
తాజావార్తలు
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!