Israel Iran Conflict: టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణి దాడులు..
- ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ముదిరిన సంఘర్షణ..
- క్షిపణులతో విరుచుకుపడిన ఇరు దేశాలు..
- టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్ ఎటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran Conflict: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. రెండు దేశాలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము ఇజ్రాయిల్ ఇరాన్ అణు కేంద్రాలను, కీలక శాస్త్రవేత్తలు, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం, ఇజ్రాయిల్ అతిపెద్ద నగరం టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. టెల్ అవీవ్తో పాటు రాజధాని జెరూసలెంలో కూడా పేలుళ్లు జరిగాయి. మరోవైపు, 24 గంటల్లోనే ఇజ్రాయిల్ మరోసారి ఇరాన్పై భీకర దాడి చేసింది.
ఇజ్రాయిల్ పై దాడులకు ఇరాన్ ‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’’గా పేరు పెట్టింది. టెల్ అవీవ్పై జరిగిన తర్వాత ఒక వ్యక్తి మరణించగా, దాదాపుగా 34 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ “ఆపరేషన్ రైజింగ్ సన్” కింద ఇరాన్పై దాడులు ప్రారంభించింది, ఇందులో కనీసం 78 మంది మరణించారు, 320 మందికి పైగా గాయపడ్డారు.
Also Read
- Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
- Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
- India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు ధ్వంసం.. ఘాటుగా స్పందించిన భారత్..
ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే లక్ష్యంతో ఇజ్రాయెల్ శుక్రవారం అతిపెద్ద దాడిని ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్, ఇజ్రాయిల్ వైమానిక, క్షిపణి దాడులకు దిగాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్ కీలకమైన వైమానిక స్థావరమైన మెహ్రాబాద్ ఎయిర్ పోర్టుపై ఇజ్రాయిల్ ప్రొజెక్టై్ల్స్తో దాడి చేసింది. ఈ దాడితో ఎయిర్ పోర్టు మంటల్లో చిక్కుకుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కూల్చేందుకు చర్యలు ఇప్పుడే ప్రారంభమైనట్లు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇరాన్ ప్రజల్ని పేదరికంలో ముంచెత్తిన హంతక ఇస్లామిక్ పాలనపై దాడిగా అభివర్ణించారు. మరోవైపు, ఇజ్రాయిల్ని దారుణంగా దెబ్బతీస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాలకు చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్తలు మరణించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మొహమ్మద్ బాఘేరి, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్కు నాయకత్వం వహించిన వ్యక్తి జనరల్ హోస్సేన్ సలామి, రివల్యూషనరీ గార్డ్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాం అధిపతి జనరల్ అమీర్ అలీ హజీజాదే హతమయ్యారు.
Yıkılasın israil! Enkazını göreyim.
Sana ülke diyenin yüzüne tüküreyim..#israil #TelAviv pic.twitter.com/OAACPPxyLB
— mahmut Nedim Polat (@nedimpolat63) June 13, 2025
తాజావార్తలు
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
-
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్లో స్థానం పక్కా.
-
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!