Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి.