Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
- భారతీయ మిత్రులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు..
- హార్ముజ్ జలసంధిపై భారత్కు ఇరాన్ సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇజ్రాయిల్, అమెరికా తమపై దాడులు చేసినప్పటికీ, హార్ముజ్ జలసంధి గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇరాన్ చెప్పింది. ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత ఇరాన్ కీలకమైన నౌకామార్గమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇరాన్ అనుమతి లేకుండా ఏ ఒక్క నౌక కూడా ఈ ఇరుకైన జలమార్గాన్ని దాటలేకపోతోంది. మరోవైపు, ఇజ్రాయిల్ -యూఎస్తో సంబంధాలు ఉన్న నౌకలతో పాటు అనుమతి లేని నౌకలపై ఇరాన్ దాడి చేస్తోంది. ప్రపంచంలో 20 శాతం చమురు ఈ మార్గం గుండానే సరఫరా అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరాన్ భారతదేశానికి స్నేహ సందేశాన్ని పంపించింది. ‘‘ మా భారతీయ మిత్రులు సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’’ అని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం గురువారం ఎక్స్లో పోస్ట్ చేసింది. గత నెలలో యుద్ధం ప్రారంభమైన తర్వాత కొన్ని నౌకలు మాత్రమే ఈ మార్గాన్ని దాటాయి. భారతదేశం, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్తో సహా “స్నేహపూర్వక దేశాలను” హోర్ముజ్ గుండా ప్రయాణించేందుకు అనుమతించినట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటి వరకు హార్ము జ్ గుండా 8 నౌకలు భారత్ వచ్చాయి. వీటిలో 94,000 టన్నుల ఎల్పీజీ ఉంది. భారత్కు ఎల్పీజీ, ముడి చమురుతో రావాల్సిన 19 నౌకలు ప్రస్తుతం హార్ముజ్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!