May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
- ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి
- ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మికులు, కర్షకులు లేని ప్రపంచాన్ని ఊహించలేము. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవి. కార్మికుల పోరాటం, త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజు కార్మికుల హక్కులను కాపాడటానికి, వారి సహకారాన్ని గౌరవించడానికి, శ్రామిక వర్గం పోరాటాలను స్మరించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జీవితాలను మార్చివేసింది. కానీ ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దానికి మే 1వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు. భారత్ లో కార్మిక దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈరోజే ఎందుకు జరుపుకుంటారు?
Also Read
మే 1న కార్మిక దినోత్సవ వేడుకలు 19వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. దీనికి ముందు, అమెరికా, యూరప్లోని కర్మాగారాల్లోని కార్మికులను 15-16 గంటలు పని చేయించేవారు. కానీ ఆ పనికి ప్రతిఫలంగా వారికి చాలా తక్కువ వేతనాలు చెల్లించేవారు. కార్మికులకు ఎటువంటి హక్కులు లేవు. వారికి ఎటువంటి సెలవులు ఉండేవి కావు. కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. దీనితో ఇబ్బంది పడిన వేలాది మంది కార్మికులు 1886 మే 1న అమెరికాలోని చికాగోలో 8 గంటల పని గంటలు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది. కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయడానికి, పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో చాలా మంది కార్మికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా కార్మికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీని తరువాత, 1889లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో, కార్మికుల పోరాటం, త్యాగాలను గుర్తుచేసుకోవడానికి మే 1ని “అంతర్జాతీయ కార్మిక దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించారు.
భారత్ లో కార్మిక దినోత్సవం
భారతదేశంలో కార్మిక దినోత్సవ వేడుకలు 1923 మే 1న చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఆ రోజున, మద్రాస్ హైకోర్టు ముందు కార్మికుల సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కుల గురించి గళాన్ని వినిపించింది. కార్మిక దినోత్సవం కేవలం సెలవుదినం కాదు. కార్మికుల సహకారాన్ని గౌరవించే రోజు. నేటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు తమ న్యాయమైన వేతనాలు, సురక్షితమైన పని వాతావరణం, సామాజిక న్యాయం కోసం పోరాడాల్సి వస్తోంది.
తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు మంత్రి పొన్నం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులకు, శ్రమైక జీవులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఆర్టీసీ కార్మికులందరికీ హృదయ పూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్ లో మీ హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకుంటూ ఎదగాలని రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?