Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Interesting Survey On Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్

Published Date :August 30, 2025 , 7:50 am
By Suresh Maddala
  • ఆపరేషన్ సిందూర్‌పై సర్వే
  • ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. 26 మందిని మతం పేరుతో చంపేశారు. ఈ సంఘటన భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మారణహోమాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. గంటల వ్యవధిలో పాకిస్థాన్‌కు సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసేసింది. పాకిస్థానీయులకు వీసాలను రద్దు చేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్ర వాదులు హతమయ్యారు. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి.

ఇది కూడా చదవండి: Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?

Also Read

  • Thalapathy Vijay: విజయ్ 'పట్టాభిషేకానికి' ఊపిరి పోస్తున్న 32 ఏళ్ల నాటి 'బొమ్మై' తీర్పు! తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్..
  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
  • DRDO TARA Test: డీఆర్‌డీఓ స్వదేశీ 'తారా' కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
Add as a preferred
source on google

తాజాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజల నుంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ ప్రజలు ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించగా.. 21 శాతం మంది బలహీనంగా ఉందని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Kurnool: ప్రేమ జంటలే టార్గెట్.. డబ్బులు, బంగారం దోపిడీ!

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి స్పందనగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంచి నిర్ణయమేనని 55 శాతం మంది సమర్థించారు. 21 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ఇంకో 15 శాతం మంది మాత్రం సంతృప్తికరంగా లేదని.. పొరుగు దేశాన్ని మరింత ఎక్కువ కాలం శిక్షించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 వరకు ఈ సర్వేను నిర్వహించారు. 54,000 మందికి పైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇక 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. ఇలా మొత్తంగా 2,06,826 మంది నుంచి ఫలితాలను రాబట్టింది.

ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా నిర్వహించిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఉగ్రవాదులంతా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందినవారుగా పేర్కొన్నారు. వీరికి పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతు ఉందని తెలిపారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMOని సంప్రదించి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారని.. మే 12న ఇద్దరు DGMOల మధ్య జరిగిన అధికారిక చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగినట్లుగా రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.

అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ చేయకపోతే వాణిజ్య ఒప్పందం చేసుకోనని బెదిరించానని.. 5 గంటల్లోనే కాల్పుల విరమణ ప్రకటించారని చెప్పారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ క్లారిటీ ఇచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Interesting survey
  • Operation Sindoor
  • Pahalgam
  • Pahalgam Attack
  • Strong reply

తాజావార్తలు

  • Thalapathy Vijay: విజయ్ ‘పట్టాభిషేకానికి’ ఊపిరి పోస్తున్న 32 ఏళ్ల నాటి ‘బొమ్మై’ తీర్పు! తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్..

  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..

  • Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions