Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
- ఆపరేషన్ సిందూర్పై సర్వే
- ప్రజలు షాకింగ్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. 26 మందిని మతం పేరుతో చంపేశారు. ఈ సంఘటన భారత్తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మారణహోమాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. గంటల వ్యవధిలో పాకిస్థాన్కు సింధు జలాలను నిలిపివేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసేసింది. పాకిస్థానీయులకు వీసాలను రద్దు చేసింది. ఇక మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్ర వాదులు హతమయ్యారు. పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన 'గోల్డెన్' స్కెచ్!
- Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
తాజాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజల నుంచి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ ప్రజలు ఆపరేషన్ సిందూర్ను సమర్థించగా.. 21 శాతం మంది బలహీనంగా ఉందని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Kurnool: ప్రేమ జంటలే టార్గెట్.. డబ్బులు, బంగారం దోపిడీ!
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి స్పందనగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మంచి నిర్ణయమేనని 55 శాతం మంది సమర్థించారు. 21 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. ఇంకో 15 శాతం మంది మాత్రం సంతృప్తికరంగా లేదని.. పొరుగు దేశాన్ని మరింత ఎక్కువ కాలం శిక్షించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. జూలై 1 నుంచి ఆగస్టు 14, 2025 వరకు ఈ సర్వేను నిర్వహించారు. 54,000 మందికి పైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇక 1,52,038 మంది ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. ఇలా మొత్తంగా 2,06,826 మంది నుంచి ఫలితాలను రాబట్టింది.
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా నిర్వహించిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రకటించారు. ఉగ్రవాదులంతా జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందినవారుగా పేర్కొన్నారు. వీరికి పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతు ఉందని తెలిపారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత DGMOని సంప్రదించి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారని.. మే 12న ఇద్దరు DGMOల మధ్య జరిగిన అధికారిక చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగినట్లుగా రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు.
అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణ చేయకపోతే వాణిజ్య ఒప్పందం చేసుకోనని బెదిరించానని.. 5 గంటల్లోనే కాల్పుల విరమణ ప్రకటించారని చెప్పారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత ప్రభుత్వం ఖండించింది. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Thursday Astrology: గురువారం దిన ఫలాలు.. వాగ్దానాలు, హామీలు అస్సలు ఇవ్వకండి!
-
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
-
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
-
US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
-
Astrology: ఎవరినైనా సులభంగా నమ్మే 4 రాశులు.. అందుకే ఎక్కువసార్లు మోసపోతారా?
ట్రెండింగ్
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!