India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Imports: భారత్ జూన్ నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. సముద్ర, వస్తు సమాచార సంస్థ క్లెపర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 19 వరకు భారత్ రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే 39 శాతం అధికం. దీంతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. అదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి దిగుమతులు కూడా అధిక స్థాయిలో కొనసాగాయి. జూన్లో రోజుకు సుమారు 6.36 లక్షల బ్యారెళ్ల చమురు భారత్కు చేరగా, మేలో ఇది 6.44 లక్షల బ్యారెళ్లుగా నమోదైంది. వెనిజులా రోజుకు 2.09 లక్షల బ్యారెళ్ల సరఫరాతో నాలుగో అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది. సౌదీ అరేబియా నుంచి రోజుకు 3.84 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతైంది.
మరోవైపు అమెరికా నుంచి చమురు దిగుమతులు భారీగా తగ్గాయి. మే నెలలో రోజుకు 2.52 లక్షల బ్యారెళ్లుగా ఉన్న దిగుమతులు జూన్లో కేవలం 91 వేల బ్యారెళ్లకు పడిపోయాయి. ఈ మార్పు భారత్ తన ఇంధన వనరులను విభిన్నీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రతిబింబిస్తోంది. రష్యా చమురు తక్కువ ధరలకు లభిస్తుండటంతో భారత రిఫైనరీలు దానిపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అలాగే హర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ నుంచి కొనుగోళ్లు పెంచడం ద్వారా సరఫరా అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశాయి.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన దిగుమతిదారైన భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం, సహజ వాయువు అవసరాల్లో సగం, ఎల్పీజీ అవసరాల్లో 65 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా-ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూసివేతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధిలో నౌకాయాన కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి. దీంతో భారత్కు ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాలపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!