వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు..50 కోట్లు క్రాస్
కరోనా టీకా పంపిణీలో భారత్ దూసుకుపోతుంది. మిగతా దేశాల కంటే స్పీడ్గా టీకా పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల డోసులను అందించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇంతే వేగంగా కొనసాగాలని చెప్పారు. ఇది అనేక మందికి ప్రేరణ అని అన్నారు. అటు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా స్పందించారు. ఆరోగ్య శాఖ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జనవరి 16న దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఆరోగ్య, మున్సిపల్ సిబ్బందికి టీకాలు ఇచ్చారు. తర్వాత ఫ్రంట్లైన్ కార్యకర్తలకు, 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందింది. ఇప్పుడు 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. దేశంలో మొదటి పది కోట్ల డోసులు ఇచ్చేందుకు 84 రోజులు పట్టగా.. చివరి పది కోట్లు.. అంటే 40 కోట్ల నుంచి 50కి చేరేందుకు 20 రోజులు మాత్రమే పట్టింది.
కేంద్రమంత్రి అమిత్ షాతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా సమావేశమయ్యారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిపై వివరించారు. కేంద్రం నుంచి మంచి సహకారం అందుతుందని పూనావాలా చెప్పారు. అంతేకాదు.. నొవావాక్స్ టీకా.. అక్టోబర్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇక చిన్న పిల్లలకు 2022 ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు సింగిల్ డోసు కరోనా టీకాను భారత్లోకి తీసుకువచ్చేందుకు జాన్సన్ & జాన్సన్ ప్రయత్నిస్తోంది.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా జాన్సన్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ టీకా 66 శాతం సమర్థంగా ఉన్నట్లు ఇప్పటికే తేలింది. సీరియస్ కేసుల్లో మాత్రం 85 శాతం ప్రభావశీలతను చూపినట్లు సంస్థ వెల్లడింది. టీకా వేసిన 28 రోజుల తర్వాత కొవిడ్ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను స్థానికంగా బయోలాజికల్ ఈ కంపెనీ ఉత్పత్తి చేయనుంది.
- Tags
- Covid19
- india
- vaccination
తాజావార్తలు
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
-
Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!