NTV Telugu Site icon

Nitin Gadkari: వచ్చే రెండేళ్లలో రవాణా ఖర్చులు మరింత తగ్గనున్నాయి..

Gadkari

Gadkari

Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14 శాతంగా ఉంది.. యూరప్​, అమెరికాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 12 శాతం ఉందని ఆయన వెల్లడించారు. చైనాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 8 శాతం ఉందని తెలిపారు.

Read Also: Viral Video: కారు ఢీకొని బీజేపీ నాయకుడి ఆరేళ్ల కుమారుడు మృతి

ఇక, మన దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు 2021- 22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 7.8 శాతం నుంచి 8.9 శాతం మధ్య ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అయితే 2022- 23లో ఇది జీడీపీలో 14- 18 శాతంగా నమోదు అయిందని చెప్పారు. ఇది ప్రపంచ సగటు దాదాపు 8 శాతం కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మిథనాల్ తయారీకి నాణ్యత లేని బొగ్గును కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌ స్థానంలో నిలపాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.